జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటించనుంది. ఐరోపా సమాఖ్యలోని 9 దేశాలకు చెందిన 27 మంది పార్లమెంటు సభ్యులు ఇవాళ జమ్ము-కశ్మీర్కు వెళ్తున్నారు.
కశ్మీర్ లోయలో పౌరహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పదేపదే పాకిస్థాన్ నిందిస్తున్న వేళ.. అక్కడి వాస్తవ పరిస్థితులపై ఆరా తీసేందుకు ఈ 27 మందిని తీసుకురావడం ద్వారా భారత్ దౌత్యపరంగా పెద్దవిజయమే సాధించింది. వారికి కశ్మీర్లో వాస్తవ పరిస్థితులు చూపించడం ద్వారా పాక్ను ఎండగట్టాలని భావిస్తోంది.
నిన్ననే దిల్లీకి వచ్చిన ఎంఈపీ సభ్యులు... ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్తో విడివిడిగా భేటీ అయ్యారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపట్ల త్వరితగతిన చర్యలుండాలంటూ పరోక్షంగా పాక్ను ఉద్దేశించి ఎంఈపీ సభ్యులతో మోదీ అన్నారు. వివిధ దేశాలకు చెందిన వీరి పర్యటన ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజల సంస్కృతి, సంప్రదాయాల గురించి వారికి అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వాల ప్రాథమ్యాలు ఏంటన్నది వారికి కూడా తెలుస్తుందన్నారు మోదీ.
కశ్మీర్లో ఈయూ ఎంపీల పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంపై ధ్వజమెత్తాయి.
'భారత పార్లమెంటుకు అవమానం'