తెలంగాణ

telangana

By

Published : Jan 25, 2020, 7:46 PM IST

Updated : Feb 18, 2020, 9:46 AM IST

ETV Bharat / bharat

ఈటీవీ భారత్​కు ఓటరు అవగాహన అవార్డు!

ఈటీవీ భారత్​కు మరో గౌరవం దక్కింది. ఓటరు అవగాహన కార్యక్రమాల్లో క్రియాశీలంగా పనిచేసినందుకు గాను ఛత్తీస్​గఢ్ లోని సర్​గుజా జిల్లా అధికార యంత్రాంగం అవార్డుతో సత్కరించింది.

voter
ఈటీవి భారత్​కు ఓటరు అవగాహన అవార్డు!

13 భారతీయ భాషల్లో సమాచారాన్ని అందిస్తున్న అతిపెద్ద డిజిటల్ వార్తా స్రవంతి ఈటీవీ భారత్​కు ఓటరు అవగాహన అవార్డు వచ్చింది. ఛత్తీస్​గఢ్​లోని సర్​గుజాలో ఓటరు చైతన్యం కోసం చేసిన కార్యక్రమాలను గుర్తించి అవార్డును ప్రకటించింది జిల్లా అధికార యంత్రాంగం. ఈ గౌరవ పురస్కారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధులకు అందజేశారు.

జాతీయ ఓటరు అవగాహన దినోత్సవం సందర్భంగా ఛత్తీస్​గఢ్​ సర్​గుజా జిల్లాలో ఓటరు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సహా పలు ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టినందుకుగాను ఈటీవీ భారత్​కు అవార్డును అందించారు. కలెక్టర్ సరన్ మిట్టర్ చేతుల మీదుగా ఈటీవీ భారత్ తరఫున విలేకరి దేశ్ దీపక్ గుప్తా ఈ అవార్డును స్వీకరించారు.

గత పదేళ్లుగా జనవరి 25ను ఓటరు అవగాహన దినోత్సవంగా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి: కరోనాపై కేంద్రం అప్రమత్తం.. అధికారులకు దిశానిర్దేశం

Last Updated : Feb 18, 2020, 9:46 AM IST

ABOUT THE AUTHOR

...view details