ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతంపై రైల్వే మంత్రి ట్వీట్ - బాపూకి ఈటీవీ భారత్ సంగీత నివాళి
ఈటీవీ భారత్ రూపొందించిన "వైష్ణవ జన తో" భజన గీతం యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది. మహాత్ముని 150 జయంతి సందర్భంగా రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆవిష్కరించిన ఈ గీతంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.
![ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతంపై రైల్వే మంత్రి ట్వీట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4618832-1098-4618832-1569954213527.jpg)
ఈటీవీ భారత్ 'వైష్ణవ జన తో' గీతంపై రైల్వే మంత్రి ట్వీట్
గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఈటీవీ భారత్ "వైష్ణవ జన తో" భజన గీతం అందరిని ఆకట్టుకుంటోంది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు హైదరాబాద్లో ఆవిష్కరించిన ఈ గీతాన్ని విన్న రాజకీయ నేతలు ప్రశంసిస్తున్నారు. రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈటీవీ భారత్ ప్రయత్నాన్ని కొనియాడారు. భారత్లోని ఉత్తమ గాయకులతో నివాళి అర్పించారని ట్వీట్ చేశారు.
Last Updated : Oct 2, 2019, 7:37 PM IST