తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2020, 10:31 PM IST

Updated : Mar 28, 2020, 5:08 AM IST

ETV Bharat / bharat

వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్'​

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కారణంగా ఇతర ప్రాంతాలకు పనికోసం వెళ్లిన అనేక మంది వలస కూలీలు అల్లాడిపోతున్నారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్​లో 150మంది వలస కూలీలు రెండు ట్రక్కుల్లో వెళ్తుండగా ఈటీవీ భారత్​ బృందం గమనించింది. వారంతా రెండు రోజులగా ఆకలితో అలమటిస్తున్నారని తెలుసుకొని ఆహారం, నీరు అందించింది

starving labourers rescued in Rajasthan
వలస కూలీల ఆకలి తీర్చిన ఈటీవీ భారత్​

వలస కూలీల ఆకలి తీర్చిన 'ఈటీవీ భారత్'​

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించింది ప్రభుత్వం. మూడు రోజులుగా రవాణా వ్యవస్థ స్తంభించింది. పొట్టకూటికోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. సొంత గూటికి చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాజస్థాన్ జైపుర్​​లో రెండు ట్రక్కుల్లో 150మందికి పైగా ప్రయాణిస్తుండగా ఈటీవీ భారత్​ ప్రతినిధి గమనించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతమంది ఎలా ప్రయాణిస్తున్నారో తెలుసుకునేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రయత్నించారు.

రెండు రోజులుగా తిండిలేక

ట్రక్కులో ఉన్నవారిని వివరాలు అడగగా వారంతా పనికోసం గుజరాత్ వలసవెళ్లారని, ఉత్తర్​ప్రదేశ్​లోని భరత్​పుర్​, దౌలాపుర్, ఆగ్రా, మధురకు ప్రాంతాలకు చెందినవారని తెలిసింది. లాక్​డౌన్​ సమయంలో ఉండడానికి ఆశ్రయం లేక సొంత ఊళ్లకు చేరుకునేందుకు రెండు ట్రక్కుల్లో పయనమయ్యారు. రెండు రోజులుగా తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటిస్తున్నట్లు ఈటీవీ భారత్​ ప్రతినిధికి తెలిపి తమ గోడు వెళ్ళబోసుకున్నారు కూలీలు. వెంటనే స్పందించిన ఈటీవీ భారత్​ బృందం పోలీసులకు, స్థానిక అధికారులకు విషయం తెలియజేసింది. 150మంది కూలీల ఆకలి తీర్చేందుకు ఆహారం, ట్యాంకర్​లో నీటిని ఏర్పాటు చేసింది.

కూలీలందరు సామాజిక దూరం పాటించారు. ఆకలి తీర్చుకున్నారు. నీరు తాగారు. అనంతరం అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, వారందరినీ సొంత ఊళ్లకు వెళ్లేందుకు అనుమతించారు పోలీసులు. ఈటీవీ భారత్​ బృందం తీసుకున్న చొరవను కూలీలు కొనియాడారు.

Last Updated : Mar 28, 2020, 5:08 AM IST

ABOUT THE AUTHOR

...view details