తెలంగాణ

telangana

ETV Bharat / bharat

23 అరుదైన రాబందుల మృతి- కారణమిదే! - విషాహారం తినడం వల్ల రాబందులు మృతి

వేగంగా అంతరించిపోతున్న జాబితాలోని రాబందులు మృతి చెందడం కలకలం రేపింది. విషంతో కూడిన ఆహారం తిని 23 రాబందులు మరణించాయి. అసోంలోని తిన్సుకియా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

endangered vultures killed after eating poisoned cattle carcasses
అంతరించిపోతున్న 23 రాబందులు మృతి

By

Published : Jan 19, 2021, 9:21 PM IST

అసోంలోని తిన్సుకియా జిల్లాలో అరుదైన జాతికి చెందిన 23 రాబందులు మృతి చెందాయి. రెండు పశువుల మృతదేహాల్ని తిన్న తరువాత ఇవి మరణించాయని అధికారులు తెలిపారు. డోలాలోని అటవీ ప్రాంతంలో రాబందులను గుర్తించారు. మరో పన్నెండు రాబందులను కాపాడారు.

అంతరించిపోతున్న 23 రాబందులు మృతి

"తాలప్​ అటవీ ప్రాంతంలో ఆదివారం రాబందుల మృతదేహాల్ని గమనించాం. పన్నెండు రాబందుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వాటికి చికిత్స అందిస్తున్నాం. విషం ప్రభావం ఎంతమేరకు ఉందో తెలియలేదు. పక్షుల మృతదేహాల్ని శవపరీక్ష కోసం పంపించాం."

-అటవీ శాఖ అధికారి

మృతి చెందిన రాబందులు చాలా అరుదైనవని అధికారులు తెలిపారు. ఈ జీవులు వేగంగా అంతరించిపోతున్నాయని చెప్పారు.

బాంబే నేచురల్​ హిస్టరీ సొసైటీ వివరాల ప్రకారం గిమ్సీ హిమాలయ గ్రిఫ్ఫన్​ రాబందు జాతికి చెందిన వీటి జనాభా భారత్-నేపాల్​లో 4 కోట్లుగా ఉండేది. కేవలం రెండు దశాబ్దాల్లోనే అందులో 99.99 శాతం అంతరించిపోయాయి.

ఇదీ చూడండి:దారుణం: 4 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి

ABOUT THE AUTHOR

...view details