తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో నలుగురు నక్సలైట్లు​ హతం

ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. భద్రతా దళాలు మూడు రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నాయి.

By

Published : Mar 26, 2019, 9:51 AM IST

Updated : Mar 26, 2019, 10:16 AM IST

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. నలుగురు నక్సల్స్​ మృతి

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​
ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం సుక్మాలోని బిమాపురం సమీపంలో నక్సలైట్లు- సీఆర్​పీఎఫ్​ బృందం మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. వారి మృతదేహాలతో పాటు మూడు రైఫిళ్లను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కర్కన్​గుడా గ్రామం వద్ద సీఆర్​పీఏఫ్​ సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వారిపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. జవాన్లు దీటుగా బదులిచ్చారు.

సార్వత్రిక ఎన్నికలతో ఛత్తీస్​గఢ్​లో నక్సల్​ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. అధికారులు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

సుక్మా జిల్లాలో ఏప్రిల్​ 11న లోక్​సభ ఎన్నికల తొలి దశ పోలింగ్​ జరగనుంది.

Last Updated : Mar 26, 2019, 10:16 AM IST

ABOUT THE AUTHOR

...view details