మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో కర్కన్గుడా గ్రామం వద్ద సీఆర్పీఏఫ్ సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో వారిపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. జవాన్లు దీటుగా బదులిచ్చారు.
ఛత్తీస్గఢ్లో నలుగురు నక్సలైట్లు హతం
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. భద్రతా దళాలు మూడు రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. నలుగురు నక్సల్స్ మృతి
సార్వత్రిక ఎన్నికలతో ఛత్తీస్గఢ్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగాయి. అధికారులు ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.
సుక్మా జిల్లాలో ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరగనుంది.
Last Updated : Mar 26, 2019, 10:16 AM IST