తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారుల మరణాలపై కేంద్రం, బిహార్​కు సుప్రీం నోటీసులు

బిహార్​లో మెదడువాపుతో చనిపోతున్న చిన్నారుల మరణాలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు బిహార్​కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాల వివరాలు సహా సంబంధిత అంశాలపై సమగ్ర అఫిడవిట్​ను దాఖలు చేయాలని ఆదేశించింది.

By

Published : Jun 24, 2019, 12:23 PM IST

సుప్రీంకోర్టు

మెదడువాపు వ్యాధితో చిన్నారులు మరణిస్తుండడంపై కేంద్రం సహా బిహార్​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిహార్​లోని ముజఫర్​పుర్​లో 100 మందికి పైగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. అనేక మంది చికిత్స పొందుతున్నారు. పిల్లల మరణాలతో ఆవేదన చెందిన మనోహర్​ ప్రతాప్​ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్​ను న్యాయస్థానం నేడు విచారించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, పోషకాహార పరిస్థితులపై సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్​ దాఖలు చేయాలని బిహార్​ ప్రభుత్వాన్ని జస్టిస్​ సంజీవ్​ ఖన్నా, జస్టిస్​ బీఆర్​ గవాయ్​లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏడు రోజుల గడువు విధించింది.

విచారణ సమయంలో ఉత్తర​ప్రదేశ్​లోనూ ముజఫర్​పుర్ తరహా మరణాలు సంభవిస్తున్నాయని న్యాయవాదులు చెప్పారు. దీంతో ఆ రాష్ట్ర సర్కారుకీ నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ విషయం 10రోజుల తర్వాత మళ్లీ విచారించనున్నట్టు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : గుడిలోకి మొసలి... గ్రామస్థుల పూజలు

ABOUT THE AUTHOR

...view details