చెట్టుపైనే వృద్ధ దంపతుల నివాసం- ఎందుకంటే...? అసోంలో ఏనుగులు... పంటపొలాలపై, మనుషులపై గుంపులు గుంపులుగా విరుచుకుపడి దాడి చేస్తుంటాయి. ఇప్పుడు ఉదల్గుడీ జిల్లాలో ఓ వృద్ధ దంపతుల ఇంటిపై గజరాజులు దాడి చేశాయి. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లిపోయాయి.
అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడినప్పటికీ వారు తలదాచుకోవటానికి కాస్తంత నీడ లేకుండాపోయింది.
చెట్టుపైనే జీవనం..
వేరే గత్యంతరం లేక ఏనుగుల నుంచి తప్పించుకోవటానికి కొద్ది రోజులుగా ఓ చెట్టుపై ఉండాలని నిశ్చయించుకున్నారా దంపతులు. వారి పెంపుడు జంతువులతో సహా చెట్టుపైనే గత పన్నెండు రోజులుగా జీవనం సాగిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి స్థానికులు కొందరు ఆహారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ఇదీ చూడండి : 105 ఏళ్ల వయస్సులో 'అఆ'ల పరీక్షకు హాజరైన బామ్మ