కేంద్ర ఎన్నికల కమిషన్లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న అశోక్ లవాసా రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయన వచ్చే నెలలో ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తన రాజీనామాను సమర్పించారు.
అశోక్ లవాసా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి - Election Commissioner Ashok Lavasa
కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా.. తన రాజీనామా లేఖను మంగళవారం రాష్ట్రపతికి పంపగా... దానికి ఆమోదం తెలిపారు కోవింద్. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో ఎన్నికల సంఘం పదవికి రాజీనామా చేశారు లవాసా.
![అశోక్ లవాసా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి Election Commissioner Ashok Lavasa submits resignation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8473070-20-8473070-1597813259630.jpg)
అశోక్ లవాసా రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం
ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సునీల్ అరోడా వచ్చే ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. అశోక్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఫలితంగా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సుశీల్ చంద్రకు సునీల్ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది.