తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆజంఖాన్​, మేనకా గాంధీపైనా ఈసీ నిషేధం... - Samajwadi Party

ఎన్నికల ప్రచారాల్లో నేతల వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తోంది.  నేడు ఉదయం ఆదిత్యనాథ్​, మాయావతిపై చర్యలు తీసుకున్న ఈసీ.. తాజాగా మరో ఇద్దరిపై ప్రచారంలో పాల్గొనకుండా తాత్కాలిక నిషేధం విధించింది.

ఆజంఖాన్​, మేనకా గాంధీపైనా ఈసీ నిషేధం...

By

Published : Apr 15, 2019, 11:13 PM IST

Updated : Apr 16, 2019, 12:16 AM IST

ఆజంఖాన్​, మేనకా గాంధీపైనా ఈసీ నిషేధం...

ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారన్న కారణంతో కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు మేనకా గాంధీ, సమాజ్​వాదీ పార్టీ నేత ఆజంఖాన్​లపై చర్య తీసుకుంది ఈసీ. మేనకాగాంధీ 48 గంటలు, ఆజంఖాన్​ 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. మంగళవారం 10 గంటలనుంచి వీరిద్దరిపై తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

సుల్తాన్‌పుర్‌ ఎన్నికల ప్రచారంలో మతాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారంటూ మేనకా గాంధీపై ఆరోపణలొచ్చాయి. రాంపుర్​ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థి, నటి జయప్రదపై.. ఎస్పీ నేత ఆజంఖాన్​ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఈసీకి ఫిర్యాదులందాయి.

మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను 3 రోజులు, బీఎస్పీ నేత మాయావతిని 48 గంటలపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలంటూ నేడు ఉదయం ఈసీ ఆదేశించింది.

ఇదీ చూడండీ: మాయావతి, ఆదిత్యనాథ్​కు ఈసీ నోటీసులు

Last Updated : Apr 16, 2019, 12:16 AM IST

ABOUT THE AUTHOR

...view details