తెలంగాణ

telangana

By

Published : Dec 10, 2019, 8:48 PM IST

Updated : Dec 10, 2019, 10:37 PM IST

ETV Bharat / bharat

పాత నోట్లతో ఇద్దరు వృద్ధులు కన్నీరుమున్నీరు​- కలెక్టర్​ సాయం

రూ.46 వేలు...! జీవితకాలం కష్టపడి ఇద్దరు వృద్ధ మహిళలు దాచుకున్న మొత్తం ఇది. వైద్య అవసరాలు మొదలు అంత్యక్రియల వరకు అన్నింటికీ ఇదే దిక్కు అనుకున్నారు. కానీ... ఆ వృద్ధులకు ఇప్పటివరకు తెలియదు వారి దగ్గర ఉన్న డబ్బంతా చిత్తు కాగితంతో సమానమని. 'నోట్ల రద్దు' గురించి మూడేళ్లు ఆలస్యంగా తెలుసుకుని ఖంగుతిన్నారు. ఎవరు వారు? ఆ సమస్యను ఎలా పరిష్కరించుకున్నారు?

Elderly sisters with demonetised notes offered pension, heathcare benefits
పాత నోట్లతో ఇద్దరు వృద్ధులు కన్నీరుమున్నీరు​- కలెక్టర్​ సాయం

పాత నోట్లతో ఇద్దరు వృద్ధులు కన్నీరుమున్నీరు​- కలెక్టర్​ సాయం

నోట్ల రద్దు.... మోదీ ప్రభుత్వం తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో ఒకటి. ఆ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే ఈ విషయం తమిళనాడుకు చెందిన ఇద్దరు వృద్ధులకు మాత్రం తెలియదు. వారే... తమిళనాడు తిరుప్పూర్​ జిల్లాలోని పూమలూర్​ గ్రామానికి చెందిన రంగమ్మళ్​​(73), తంగమ్మళ్​​(78). ఇద్దరూ తోబుట్టువులు.

ఇదీ చూడండి : ఈటీవీ భారత్​ను వరించిన 'కోయిర్ కేరళ-2019' అవార్డు

దాదాపు 20 ఏళ్లుగా పశువులను అమ్మడం, పొలంలో కూలి పని చేయడం ద్వారా వచ్చే డబ్బుతో దాదాపు రూ.46 వేలు కూడబెట్టుకున్నారు. ఈ మొత్తంలో రంగమ్మళ్​ రూ. 24 వేలు, తంగమ్మళ్ రూ. 22 వేలు పోగు చేశారు. వారి అంత్యక్రియలకు, మనువళ్లు, మనువరాళ్లకోసం ఈ సొమ్మును దాచుకున్నారు. కుమారులకు మద్యం సేవించే అలవాటు ఉన్నందున.. వారికి ఈ విషయం చెప్పకుండా, ఇంట్లోని బియ్యం బస్తాలు, అల్యూమినియం పెట్టెలు, నడుముకు కట్టుకునే సంచుల్లో డబ్బు దాచుకుంటూ వచ్చారు.​

తంగమ్మళ్​కు ఇటీవల అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. చికిత్స కోసం దాచుకున్న డబ్బును బయటకు తీశారు. తీరా చూస్తే ఆ నోట్లు మూడేళ్ల క్రితమే రద్దయ్యాయని తెలిసింది. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయం జిల్లా కలెక్టర్​ విజయ్​ కార్తికేయన్ వరకు చేరింది. ఆయన చొరవతో ఆ ఇద్దరు వృద్ధులకు వైద్య సాయం, పింఛను అందుతున్నాయి.

" నా పేరు రంగమ్మళ్, వయసు 73 ఏళ్లు. నా భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయారు. నాకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. మా సమస్య తెలుసుకుని కలెక్టర్​ స్పందించారు. వైద్య చికిత్స అందించాల్సిందిగా పెరునురాయ్​ వైద్య కళాశాలకు లేఖ రాశారు."
- రంగమ్మళ్​, పాతనోట్లు దాచుకున్న వృద్ధురాలు

తంగమ్మళ్, రంగమ్మళ్​కు సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇరువురికి కలిపి రూ.46వేల చెక్​ అందించింది.

2016 నవంబరు 8న నోట్లు రద్దు

ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కార్​ 2016 నవంబరు 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను తెచ్చింది.

Last Updated : Dec 10, 2019, 10:37 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details