రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీల ద్వేష భావజాలాన్ని ఓడించటానికి చేసే ఏ త్యాగమైనా గొప్పదేనని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ నేషనల్ మెమోరియాల్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు రాహుల్.
ఈ సమావేశంలో యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అధికారికంగా హాజరైన మొదటి భేటీ నేడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశమే.
దండి యాత్ర నేడే...