తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: రాహుల్​

భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు చేసే త్యాగాలన్నీ గొప్పవేనని కాంగ్రెస్​ అధ్యక్షుడు ట్విట్టర్​లో వ్యాఖ్యానించారు. గుజరాత్​లో జరిగిన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు రాహుల్​.

By

Published : Mar 12, 2019, 5:54 PM IST

ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: రాహుల్​

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​(ఆర్​ఎస్​ఎస్​)​, భారతీయ జనతా పార్టీల ద్వేష భావజాలాన్ని ఓడించటానికి చేసే ఏ త్యాగమైనా గొప్పదేనని ట్వీట్​ చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. గుజరాత్​ అహ్మదాబాద్​లోని సర్దార్​ పటేల్​ నేషనల్​ మెమోరియాల్​లో జరిగిన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు రాహుల్​.

ఈ సమావేశంలో యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​తో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. లోక్​సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అధికారికంగా హాజరైన మొదటి భేటీ నేడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశమే.

దండి యాత్ర నేడే...

సమావేశానికి ముందు మహత్మాగాంధీకి నివాళులర్పించారు కాంగ్రెస్​ నేతలు. 1930 సంవత్సరంలో ఈ రోజే అంటే మే 12నే చారిత్రక దండి యాత్ర ప్రారంభమైంది.

మోదీ విధానాలతో బాధపడుతున్నారు : సోనియా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పుడు విధానాల వల్ల దేశ ప్రజలు బాధపడుతున్నారని యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ అన్నారు. దేశ భద్రతను రాజకీయ చేస్తున్నారని విమర్శించారు. గత యూపీఏ ప్రభుత్వ విజయాలను ఉటంకించారు.

వ్యవసాయ రంగ సంక్షోభం, పారిశ్రామిక వృద్ధి తగ్గిపోవటం, నిరుద్యోగం లాంటి అంశాలపై మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ ప్రసంగించారు.

ABOUT THE AUTHOR

...view details