తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈనెల 6న ఎనిమిదోరౌండ్​ కమాండర్​ స్థాయి చర్చలు

భారత్​, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా భారత్​-చైనాల మధ్య 8వ రౌండ్​ కమాండర్​ స్థాయి చర్చలు ఈనెల 6న జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్​లోని చుషూల్​లో ఇరు దేశాల అధికారులు సమావేశం కానున్నారు. బలగాల ఉపసంహరణ, సరిహద్దుల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించటంపైనే కీలకంగా చర్చలు సాగనున్నాయి.

By

Published : Nov 4, 2020, 10:25 PM IST

Commander-level talks b
ఎనిమిదోరౌండ్​ కమాండర్​ స్థాయి చర్చలు

భారత్​-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకటమే లక్ష్యంగా ఎనిమిదో దఫా కార్ఫ్స్​ కమాండ్​ స్థాయి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. ఈనెల 6న తూర్పు లద్ధాఖ్​లోని చుషూల్​ ప్రాంతంలో ఇరు దేశాల అధికారులు భేటీ కానున్నారు.

భారత బృందానికి ఇటీవలే లేహ్ కమాండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న లెఫ్టినెంట‌్ జనరల్‌ పీజీకే మేనన్‌ నేతృత్వం వహించనున్నారు. ఆయన తొలిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

శీతాకాలంలో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకు పడిపోతాయి. ఈ క్రమంలో జరగనున్న ఎనిమిదో విడత చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్‌- చైనా సంబంధాలపై సరిహద్దు సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంది. సరిహద్దులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై చైనా గౌరవం చూపాలని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఏప్రిల్​-మే సమయంలో తూర్పు లద్దాఖ్​లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవటం, ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు నెలల తర్వాత పాంగోంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని కీలక పర్వతాలను భారత్​ కైవసం చేసుకుంది. భారత బలగాలు వాస్తవాధీన రేఖకు తమవైపే ఉన్నప్పటికీ.. చైనా వ్యతిరేకిస్తోంది.

ఈ క్రమంలో ఇరు దేశల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయి. అక్టోబర్​ 12న చివరిసారిగా, ఏడో విడత కార్ఫ్స్​ కమాండర్​ స్థాయి చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణ, యథాతథ స్థితిని పునరుద్ధరించటం సహా కీలక అంశాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: మోదీ-జిన్​పింగ్​ స్థాయి చర్చలతోనే ఫలితాలు!

ABOUT THE AUTHOR

...view details