భారత్-చైనా మధ్య సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలకటమే లక్ష్యంగా ఎనిమిదో దఫా కార్ఫ్స్ కమాండ్ స్థాయి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. ఈనెల 6న తూర్పు లద్ధాఖ్లోని చుషూల్ ప్రాంతంలో ఇరు దేశాల అధికారులు భేటీ కానున్నారు.
భారత బృందానికి ఇటీవలే లేహ్ కమాండెంట్గా బాధ్యతలు తీసుకున్న లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్ నేతృత్వం వహించనున్నారు. ఆయన తొలిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు.
శీతాకాలంలో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకు పడిపోతాయి. ఈ క్రమంలో జరగనున్న ఎనిమిదో విడత చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్- చైనా సంబంధాలపై సరిహద్దు సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంది. సరిహద్దులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై చైనా గౌరవం చూపాలని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.