తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి

ఛత్తీస్​గఢ్​ బెమెత్రా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Nov 21, 2019, 11:24 PM IST

Updated : Nov 21, 2019, 11:35 PM IST

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి

చెరువులోకి దూసుకెళ్లిన కారు

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెత్రా జిల్లా మోహ్భత్తా సమీపంలో ఓ కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. బెమెత్రా నుంచి మోహ్భత్తా వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలానికి చెరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు బెమెత్రా జిల్లా నదల్​ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఇదీ చూడండి: రాజ్యసభ సెలక్ట్ కమిటీ పరిశీలనకు సరోగసీ బిల్లు

Last Updated : Nov 21, 2019, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details