తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉసురు తీసిన హీటర్​- 8 మంది పర్యటకులు మృతి - ఎనిమిది మంది భారత పర్యాటకులు మృతి

నేపాల్​లో ఎనిమిది మంది భారతీయులు మరణించారు. వారు ఉంటున్న హోటల్ గదిలో గ్యాస్ లీకవ్వడం కారణంగానే ఈ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో నలుగురు మైనర్​లు ఉన్నట్లు అధికారులు

Eight Indians die due to possible gas leak in Nepal
ఉసురు తీసిన హీటర్​- 8 మంది పర్యటకులు మృతి

By

Published : Jan 21, 2020, 4:32 PM IST

Updated : Feb 17, 2020, 9:12 PM IST

నేపాల్​లోని ఓ రిసార్టులో ఉన్న కేరళకు చెందిన ఎనిమిది మంది పర్యటకులు మృతి చెందారు. ఇందులో నలుగురు మైనర్​లు ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ లీకైన కారణంగానే వీరందరూ మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

స్పృహ కోల్పోయిన పర్యటకులను కాఠ్​మాండూలో హెచ్​ఏఎంఎస్ ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

"ఎనిమిది మందిని కాట్​మాండూలోని ఆస్పత్రికి హెలికాప్టర్​ ద్వారా తరలించాం. క్షతగాత్రుల ఆరోగ్యాన్ని పరిశీలించడానికి ఓ భారతీయ వైద్యుడిని సైతం ఆస్పత్రికి పంపించాం. కానీ మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు."
-నేపాల్​లోని భారత రాయబార కార్యాలయం

కేరళకు చెందిన 15 మంది బృందం నేపాల్​లోని ప్రఖ్యాత పర్వత పర్యటక కేంద్రమైన పోఖరా ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చే క్రమంలో మకవాన్​పుర్​ జిల్లా డామన్ ప్రాంతంలో పనోరమ రిసార్టులో దిగినట్లు చెప్పారు. వెచ్చదనం కోసం గదిలోని గ్యాస్ హీటర్​ను ఉపయోగించినట్లు హోటల్ నిర్వాహకులు వెల్లడించారు. ఆ సమయంలో గది కిటికీలు, తలుపులు అన్నీ లోపలి నుంచి మూసి ఉన్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంలో సాధ్యమైన సహాయం అందించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు.

ఇదీ చదవండి: 'జేఎన్​యూ వీసీ తొలగింపు డిమాండ్​ అహేతుకం'

Last Updated : Feb 17, 2020, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details