తెలంగాణ

telangana

'పీఎన్​బీ' నిందితుడు నీరవ్​మోదీ పెయింటింగ్స్​ వేలం

By

Published : Mar 21, 2019, 6:10 AM IST

Updated : Mar 21, 2019, 6:21 AM IST

వజ్రాల వ్యాపారి, పీఎన్​బీ కుంభకోణం నిందితుడు నీరవ్​మోదీకి చెందిన 173 పెయింటింగ్స్​, 11 ఖరీదైన వాహనాలను ఈడీ వేలం వేయనుంది. మరోవైపు నీరవ్​ భార్య అమీపై ముంబయి ప్రత్యేక న్యాయస్థానం నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది.

'పీఎన్​బీ' నిందితుడు నీరవ్​మోదీ పెయింటింగ్స్​ వేలం

'పీఎన్​బీ' నిందితుడు నీరవ్​మోదీ పెయింటింగ్స్​ వేలం
పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీకి చెందిన 173 పెయింటింగ్​లను, 11 ఖరీదైన వాహనాలను ఈడీ అమ్మకానికి పెట్టనుంది. ఇందుకోసం ముంబయి ప్రత్యేక న్యాయస్థానం నుంచి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ)కు అనుమతి లభించింది. మరో వైపు నీరవ్​మోదీ భార్య అమీపై కోర్ట్​ నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది. పీఎన్​బీ కుంభకోణంలో అమీ పాత్రపై గతంలో ఈడీ అనుబంధ ఛార్జ్​షీట్​ను దాఖలు చేసింది.

నీరవ్​ మోదీకి చెందిన ఈ పెయింటింగ్​లు దాదాపు రూ. 57 కోట్ల 72 లక్షల విలువ చేస్తాయి. వీటితో పాటు రోల్స్​ రాయిస్​, మెర్సిడెజ్​, పోర్చే, టొయోటో ఫార్చునర్​ వంటి 11 విలాసవంతమైన కార్లను ఈ నెలలోనే వేలం వేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మరో 68 పెయింటింగ్​లను సైతం అమ్మకానికి పెట్టేలా ఆదాయ పన్ను శాఖకు న్యాయస్థానం అనుమతించింది.

భారత ఈడీ అభ్యర్థన మేరకు లండన్​ కోర్టు నీరవ్​మోదీపై అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. దీంతో బుధవారం లండన్​లోని స్కాట్​లాండ్ యార్డ్​లో నీరవ్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫలితంగా, అతన్ని భారత్​కు రప్పించేందుకు మార్గం సుగమమైంది.

Last Updated : Mar 21, 2019, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details