తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

విమానయాన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 23న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

By

Published : Aug 20, 2019, 6:10 AM IST

Updated : Sep 27, 2019, 2:49 PM IST

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చిదంబరం. ఈ విషయంపై ఆగస్టు 23న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది.

మాజీ విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్‌ను గతంలో ప్రశ్నించిన ఈడీ.. తాజాగా చిదంబరానికి సమన్లు జారీ చేసింది. అంశాల వారీగా అభియోగాలు నమోదయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు స్లాట్స్‌ కేటాయించడంలో అవకతవకలు, వేల కోట్ల కుంభకోణం కారణంగా ఎయిర్‌ఇండియా తీవ్ర నష్టాలను చవిచూసినట్లు కేసు నమోదు చేశారు.

ఈ కేసుతో పాటు ఎయిర్‌సెల్ మాక్సిస్, ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులలో కూడా మనీ లాండరింగ్‌ వ్యవహారంపై చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: బిహార్ మాజీ సీఎం జగన్నాథ్​ మిశ్రా మృతి

Last Updated : Sep 27, 2019, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details