తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ ప్రఫుల్​ పటేల్​కు ఈడీ సమన్లు - ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ సమన్లు జారీ

కేంద్ర మాజీ మంత్రి, ఎన్​సీపీ నేత ప్రఫుల్ పటేల్​కు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ప్రఫుల్​ పటేల్.

ప్రఫుల్​ పటేల్​కు ఈడీ సమన్లు

By

Published : Oct 15, 2019, 7:40 PM IST

మనీలాండరింగ్ ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి ఎన్​సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సన్నిహితుడైన ఇక్బాల్‌ మిర్చి భార్య నుంచి ఆస్తులకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్ పటేల్‌ను ఈడీ విచారించనుంది. ఇందుకోసం ఈ నెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

ఈ నెల 21న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా 18న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు పటేల్‌కు సమన్లు జారీచేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఖండించిన ప్రఫుల్​ పటేల్​

ఆరోపణలను ప్రఫుల్ పటేల్ తోసిపుచ్చారు. తనపై అనవసరంగా నిరాధార నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. మీడియాకు లీకైన దస్తావేజులు తన దృష్టికి ఎప్పుడూ రాలేదన్నారు.

ఇదీ సంగతి

ఈడీ కథనం ప్రకారం పటేల్​ ఆధ్వర్యంలో నడిచే మిలీనియం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2006-07 సంవత్సరంలో సీజే హౌస్​ అనే బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించింది. అందులోని మూడు, నాల్గవ అంతస్థులను మిర్చి భార్య హజ్రా ఇక్బాల్​ పేరిట రాశారు. భవనం నిర్మించిన స్థలానికి మిర్చి యజమాని. అయితే ఆ స్థలాన్ని మనీ లాండరింగ్, మాదక ద్రవ్యాల సరఫరా వంటి అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయంతో కొనుగోలు చేశారన్నది ఈడీ ప్రధాన అభియోగం.

ABOUT THE AUTHOR

...view details