తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు మరోసారి ఈడీ ఎదుట విచారణకు వాద్రా...

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ బావ రాబర్ట్​ వాద్రాకు.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ నగదు చలామణి కేసులో నేడు ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించారు అధికారులు.

By

Published : May 30, 2019, 5:12 AM IST

నేడు మరోసారి ఈడీ ఎదుట విచారణకు వాద్రా...

ఈడీ విచారణకు వాద్రా

అక్రమ నగదు చలామణి ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్డ్​ వాద్రా నేడు మరోసారి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) విచారణ ఎదుర్కోనున్నారు. దిల్లీలోని సంస్థ కార్యాలయంలో 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది ఈడీ.

ఇదీ కారణం...

రాబర్ట్ వాద్రా లండన్​లో 1.9 మిలియన్​ పౌండ్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారన్నది ఆరోపణ. ఇందుకోసం అక్రమ నగదు బదిలీకి పాల్పడ్డారన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఈడీ ఇప్పటికే అనేక చోట్ల సోదాలు జరిపి కీలక ఆధారాలు సేకరించింది.

వాద్రాకు మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ ఇప్పటికే దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈడీ పిటిషన్‌పై జులై 17లోగా స్పందించాలని దిల్లీ హైకోర్టు వాద్రాను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు వాద్రాను విచారించిన ఈడీ.. తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది.

అయితే.. విదేశాల్లో అక్రమంగా ఆస్తులు కూడపెట్టారన్న ఆరోపణలను వాద్రా మొదటి నుంచీ ఖండిస్తూ వస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కొందరు తనపై ఇలా కుట్రపన్నారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ఆటోలో ప్రచారం చేసి.. గెలిచిన 'ఒడిశా మోదీ'

ABOUT THE AUTHOR

...view details