తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2020, 9:09 PM IST

ETV Bharat / bharat

ఆ 5 రాష్ట్రాల్లో అధికారుల బదిలీలపై ఈసీ అడ్వైజరీ

2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో అధికారుల బదిలీలపై ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులకు అడ్వైజరీ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలతో నేరుగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలపై కీలక సూచనలు చేసింది. ఈ అంశంపై సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ECI sends transfer advisory
కేంద్ర ఎన్నికల సంఘం

వచ్చే ఏడాది తొలినాళ్లలో శాసనసభ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శలు (సీఎస్​), రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు (సీఈఓ)లకు.. బదిలీలపై కీలక సూచనలు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ జాబితాలో అసోం, కేరళ, తమిళనాడు, బంగాల్​, పుదుచ్చేరిలు ఉన్నాయి.

"స్వేచ్ఛాయుతంగా, సక్రమంగా ఎన్నికల నిర్వహణ కోసం ఓటింగ్​ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలతో నేరుగా అనుబంధం ఉన్న అధికారును బదిలీ చేయాలి. ఆయా అధికారులను వారి సొంత జిల్లాల్లో కానీ, చాలా కాలం నుంచి పని చేసిన ప్రదేశాలలో కానీ పోస్టింగ్​ ఇవ్వకూడదు. ఇదే స్థిరమైన విధానాన్ని ఎన్నికల కమిషన్​ అనుసరిస్తోంది. "

- కేంద్ర ఎన్నికల సంఘం అడ్వైజరీ

అధికారుల బదిలీలపై సకాలంలో, కఠినమైన నిర్ణయం తీసుకోవాలని, తమ అంగీకారాన్ని తెలపాలని ఎన్నికల కమిషనర్లను ఆదేశించింది ఈసీ.

ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ గడువు 2021 మే-జూన్​ మధ్య కాలంలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది ఈసీ.

ఇదీ చూడండి: ఎన్నికల గుర్తుపై హైకోర్టుకు కమల్​ హాసన్​

ABOUT THE AUTHOR

...view details