తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ పార్టీల జాతీయ హోదా.... గల్లంతేనా?

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఎన్​సీపీ, తృణమూల్​ కాంగ్రెస్, సీపీఐలకు ఎన్నికల కమిషన్​ షోకాజ్​ నోటీసులు జారీచేసింది. వాటి జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో ఆగస్టు 5లోగా వివరణ ఇవ్వాలని కోరింది.

By

Published : Jul 19, 2019, 6:05 AM IST

జాతీయ పార్టీ హోదా... గల్లంతేనా?

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపాలైన ఎన్​సీపీ, తృణమూల్​ కాంగ్రెస్, సీపీఐలు తమ జాతీయ పార్టీ హోదాను కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తాజాగా భారత ఎన్నికల కమిషన్​ ఆయా పార్టీలకు షోకాజు నోటీసులు జారీచేసింది. వారి జాతీయ పార్టీ హోదాను ఎందుకు రద్దు చేయకూడదో ఆగష్టు 5లోగా వివరించాలని కోరింది.

2014 లోక్​సభ ఎన్నికల్లో ఎన్​సీపీ 6 సీట్లు సాధించగా.... ఈసారి ఎన్నికల్లో మాత్రం ఐదు సీట్లకు మాత్రమే పరిమితమైంది. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికలపడింది.

ఇదే విధంగా... 2014 ఎన్నికల్లో 34 లోక్​సభ సీట్లు సాధించి విజయం సాధించిన తృణమూల్​ కాంగ్రెస్... తాజా ఎన్నికల్లో కేవలం 22 సీట్లు మాత్రమే సాధించగలిగింది.

కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన సీపీఐ... తాజా ఎన్నికల్లో రెండు సీట్లు సాధించింది. కానీ పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వీటి జాతీయ పార్టీ హోదాకు ముప్పు ఏర్పడింది.

నియమాలు మారాయి..

2014 లోక్​సభ ఎన్నికల్లో ఘోరపరాజయం మూటకట్టుకున్న సీపీఐ, బీఎస్పీ, ఎన్​సీపీలు తమ జాతీయ పార్టీ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. అయితే 2016లో ఎన్నికల కమిషన్​.. నియమాలను సవరించడం వల్ల ఆయా పార్టీలకు ఉపశమనం కలిగింది. రాజకీయ పార్టీల జాతీయ హోదాను ప్రతి ఐదు సంవత్సరాలకు బదులుగా ప్రతి 10 సంవత్సరాలకు సమీక్షించాలని నిర్ణయించేందుకు నిర్ణయం తీసుకుంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 లోక్​సభ సీట్లు, కొన్ని అసెంబ్లీ సీట్లు సాధించిన 'బహుజన్ సమాజ్ పార్టీ' (బీఎస్పీ) జాతీయ హోదాను నిలబెట్టుకోగలిగింది.

జాతీయ పార్టీ హోదా..

ఎన్నికల చిహ్నాలు (రిజర్వేషన్​, కేటాయింపులు) ఉత్తర్వు, 1968 ప్రకారం... ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే...

1. లోక్​సభ లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో... నాలుగు లేదా అంత కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆ పార్టీ కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి.

2. లోక్​సభలో ఆ పార్టీకి చెందిన కనీసం నలుగురు సభ్యులు ఉండాలి.

3. మొత్తం లోక్​సభ స్థానాల్లో కనీసం 2 శాతం సీట్లు పొంది ఉండాలి. అలాగే ఆ పార్టీ సభ్యులు కనీసం 3 రాష్ట్రాలకు చెందిన వారై ఉండాలి.

ప్రస్తుతం టీఎమ్​సీ, భాజపా, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్​సీపీ, నేషనల్​ పీపుల్స్ పార్టీ ఆఫ్ మేఘాలయ జాతీయ పార్టీ హోదా కలిగి ఉన్నాయి.

ఇదీ చూడండి: కర్​నాటకీయంలో ఆఖరి అంకం నేడేనా!

ABOUT THE AUTHOR

...view details