తెలంగాణ

telangana

చౌకీదార్​ కప్పులపై రైల్వేకు ఈసీ నోటీసులు

By

Published : Mar 30, 2019, 4:58 PM IST

టీ కప్పులపై 'నేనూ కాపలాదారునే' నినాదం వ్యవహారంలో రైల్వే శాఖపై చర్యలు చేపట్టింది భారత ఎన్నికల సంఘం. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని షోకాజ్​ నోటీసులు జారీ చేసింది.

టీ కప్పులపై మోదీ నినాదంతో మరోసారి చిక్కుల్లో రైల్వే

'నేనూ కాపలాదారునే' నినాదం రైల్వే టీ కప్పులపై దర్శనమివ్వడాన్ని తీవ్రంగా పరిగణించింది ఎన్నికల సంఘం. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందని.. రైల్వే శాఖపై చర్యలకు ఉపక్రమించింది. వివరణ ఇవ్వాల్సిందింగా షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ చిత్రాలతో టికెట్లు ఇచ్చి ఇటీవల ఎన్నికల నియమావళి ఉల్లంఘించింది రైల్వే శాఖ.

టీ కప్పుపై చౌకీదార్​ నినాదం ఉన్న ఫొటోను ఓ ప్రయాణికుడు ట్వీట్​ చేయటం... నెట్టింట్లో వైరల్​గా మారడం చకచకా జరిగిపోయాయి.

ఇది ఉద్దేశపూర్వకం కాదని.. అనుకోని తప్పిదమని పేర్కొంది భారతీయ రైల్వే.

ఇదీ చూడండీ: రైల్వే టీ కప్పులపై 'చౌకీదార్'​ రగడ

ABOUT THE AUTHOR

...view details