'మే బీ చౌకీదార్' ప్రచారానికి సంబంధించిన చిత్రాలనురైల్వేశాఖ టికెట్లు, టీ కప్పులపై ముద్రించడాన్ని తప్పుపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది ఎన్నికల నియామవళి ఉల్లంఘన కిందికి వస్తుందా... లేదా అనే అంశమై రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. గురువారంలోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శతాబ్ది ఎక్స్ప్రెస్కు చెందిన టికెట్లను ఓ ప్రయాణికుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వాటిపై మై బీచౌకీదార్ నినాదం ఉండటం వివాదానికి కారణమైంది.
వివాదాస్పద కప్పులను వెనక్కి పంపిస్తామని, గుత్తేదారుపై చర్య తీసుకుంటామని రైల్వేశాఖ ప్రకటించింది. రైల్వే టికెట్లపై మోదీ చిత్రాలను ముద్రించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది.