తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగారం స్మగ్లింగ్​ ముఠా అరెస్టు- 4.3 కిలోలు స్వాధీనం

కేరళలో బంగారం అక్రమ రవాణా చేస్తోన్న ముఠాను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 4.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోజికోడ్​ విమానాశ్రయంలో నిందితుల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు.

By

Published : Sep 7, 2020, 7:07 AM IST

smuggling gold
బంగారం స్మగ్లింగ్

కేరళ కోజికోడ్​ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురుని డైరెక్టరేట్​ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ (డీఆర్​ఐ) అరెస్టు చేసింది. వారి నుంచి 4.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిపింది.

"కరీపుర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కొచ్చి, కోజికోడ్​కు చెందిన డీఆర్​ఐ అధికారులు బంగారం స్మగ్లింగ్​ చేస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో నిందితులు వేగంగా దూసుకెళ్లగా ఇద్దరు అధికారులు, ఓ డ్రైవర్ గాయపడ్డారు. అయినప్పటికీ నిందితులను అధికారులు పట్టుకుని వారి నుంచి 4.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు."

- సీబీఐసీ

గాయపడిన డీఆర్​ఐ అధికారుల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఆరా తీశారు. వారికి అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పించాలని సీబీఐసీని ఆదేశించారు.

ఇదీ చూడండి:మాజీ ఎమ్మెల్యేను కొట్టి చంపిన దుండగులు

ABOUT THE AUTHOR

...view details