తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా ఉద్ధృతమైనా.. కేసుల రెట్టింపు ఆలస్యం'

కరోనా కేసుల రెట్టింపు వ్యవధి 17.4 రోజులకు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2 వారాల క్రితం ఈ సమయం 15.4గా ఉంది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రెట్టింపు వ్యవధి పెగడం సానుకూలమని వెల్లడించింది.

By

Published : Jun 12, 2020, 6:52 PM IST

Doubling time of coronavirus cases
'కరోనా ఉద్ధృతమైనా పెరిగిన కేసుల రెట్టింపు వ్యవధి'

మార్చి 25న లాక్​డౌన్​ విధించే సమయానికి 3.4 రోజులుగా ఉండేది కరోనా కేసుల రెట్టింపు వ్యవధి. తాజాగా ఈ సమయం 17.4 రోజులకు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజుకు సగటున 10 వేల కేసులు నమోదవుతున్నా కరోనా కేసుల రెట్టింపు సమయం పెరగడం గమనార్హం.

అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య, పట్టణ కార్యదర్శులతో కేబినెట్​ సెక్రటరీ వీడియో సమావేశం నిర్వహించారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువులైన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

కంటైన్​మెంట్​ జోన్లు, పరీక్షలు, ఆరోగ్య కేంద్రాల మౌలిక సదుపాయాలు సహా సిబ్బంది వినియోగంపై దృష్టి సారించాలని కేబినెట్​ సెక్రటరీ రాష్ట్రాలకు సూచించారు.

మరిన్ని సూచనలు

⦁ కంటైన్​మెంట్​ జోన్లలో ప్రతి ఇంటిపై పర్యవేక్షణ ఉంచాలి.

⦁ వీలైనంత త్వరగా కరోనా కేసులను గుర్తించాలి.

⦁ బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం, భౌతిక దూరం పాటించేలా చూడాలి.

పెరిగిన రికవరీ రేటు...

దేశంలో వైరస్​ నుంచి కోలుకున్న వారి శాతం (రికవరీ రేటు) క్రమంగా పెరుగుతుందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 49.47గా ఉంది.

దేశవ్యాప్తంగా పరీక్షల సామర్థ్యం పెంచినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్​ఆర్​) తెలిపింది. మొత్తం 877 ప్రయోగశాలల్లో (637 ప్రభత్వ, 240 ప్రైవేట్) కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:రాత్రి వేళ కర్ఫ్యూ అమలుపై కేంద్రం క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details