తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2020, 5:04 AM IST

ETV Bharat / bharat

భారత్- చైనా సరిహద్దుల్లో రెండు మూపురాల ఒంటెలు!

తూర్పు లద్దాఖ్​లోని భారత్-చైనా సరిహద్దులో గస్తీ కోసం రెండు మూపురాల ఒంటెలను ఉపయోగించనుంది సైన్యం. ఇప్పటికే వీటి సామర్థ్యంపై డీఆర్​డీఓ పరిశోధనలు చేస్తోంది. సంతానోత్పత్తి ద్వారా వీటి సంఖ్యను పెంచిన అనంతరం భారత సైన్యానికి ఈ ఒంటెలు సేవలందిస్తాయని సమాచారం.

camel
రెండు మూపురాల ఒంటెలు

భారత సైన్యంలో సేవలందించేందుకు రెండు మూపురాల ఒంటెలు సిద్ధమవుతున్నాయి. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి దళాలు గస్తీ నిర్వహించడానికి వీటిని త్వరలో భారత సైన్యంలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది.

లద్దాఖ్​లోని లేహ్​లో 17 వేల అడుగుల ఎత్తులో 170 కిలోల భారాన్ని మోయగల రెండు మూపురాల ఒంటెలపై రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ)పరిశోధనలు చేసింది. ఒకే మూపురం ఉన్న ఒంటెలకన్నా ఇవి ఎక్కువ కాలం నీరు, ఆహారం లేకుండా ఉండగలవని గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు.

"ఈ ఒంటెల ఓపిక, సామర్థ్యంపై పరిశోధనలు జరిపాం. ఇవి స్థానిక జంతువులు. చైనా సరిహద్దుల్లోని ఎత్తైన ప్రదేశాల్లో 170 కిలోల భారాన్ని మోయగలవని గుర్తించాం. ఈ భారంతో అవి 12 కిలోమీటర్ల వరకు పెట్రోలింగ్ చేయవచ్చు. అయితే, ఈ ఒంటెల జనాభా తక్కువ ఉన్నందున వాటి సంఖ్యలను పెంచిన తర్వాత వాటిని సైన్యంలో చేర్చుకుంటారు."

-ప్రభు ప్రసాద్ సారంగి, డీఆర్‌డీవో శాస్త్రవేత్త

రెండు మూపురాల ఒంటెలు 3 రోజుల వరకు ఇవి ఆహారం, నీరు లేకుండా జీవించగలవు. ప్రస్తుతం వీటి సంఖ్యను పెంచటంపై డిఫెన్స్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్ దృష్టిసారించింది.

ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం 40 కిలోల భారాన్ని మోయగల గుర్రాలను భారత సైన్యం వినియోగిస్తుంది.

ఇదీ చూడండి:ఎడారిలో స్పెషల్​ ఫోర్స్​.. అమెరికా తొలిసారి ఏర్పాటు!

ABOUT THE AUTHOR

...view details