తెలంగాణ

telangana

కరోనా వేళా.. రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ

By

Published : May 26, 2020, 1:53 PM IST

అయోధ్యలో రామజన్మభూమి అంశం సుప్రీం తీర్పుతో కొలిక్కి వచ్చి మందిర నిర్మాణం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణానికి అవసరమైన నగదుకై విరాళాల సేకరణ కోసం అకౌంట్లు ఏర్పాటు చేసింది రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​. అయితే కరోనాను కూడా లెక్క చేయకుండా మందిర నిర్మాణం కోసం భక్తులు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ. 4.60 కోట్లు విరాళంగా అందించారు.

ram mandir
రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ

కరోనా వైరస్​, లాక్​డౌన్​ ఆంక్షలతో యావత్ ప్రపంచం అతలాకుతలమవుతోంది. ఆర్థిక వ్యవస్థ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే మందిర నిర్మాణంపై భక్తుల్లో ఉన్న ఆసక్తిని వైరస్ ఏమాత్రం నిలువరించలేకపోయింది. లాక్​డౌన్​ సమయంలోనూ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. విరాళాలు అందించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేసిన అకౌంట్లలోకి కరోనా పరిస్థితిని లెక్క చేయకుండా నగదును ట్రాన్స్​ఫర్ చేశారు భక్తులు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన రెండు అకౌంట్లలోకి ఇప్పటివరకు రూ. 4.60 కోట్లు జమయ్యాయి.

'నగదు కొరతకు అవకాశమే లేదు'

రామ మందిర నిర్మాణానికి నగదు కొరత ఏర్పడుతుందని అనుకోవడం లేదని తెలిపారు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ప్రజలు పెద్దమొత్తంలో కానుకలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యంత సుందరమైన మందిరం తయారుకానుందని ధీమా వ్యక్తం చేశారు.

ఐదువేల మంది కానుకలు..

ఇప్పటివరకు సమకూరిన మొత్తాన్ని ఐదువేలమంది.. మందిర నిర్మాణ కానుకగా అందించారని సమాచారం. మందిర నిర్మాణ విరాళాల కోసం సేవింగ్స్, కరెంట్ అకౌంట్లను ఏర్పాటు చేసింది మందిర నిర్మాణ ట్రస్ట్​.

ఇదీ చూడండి:విమానంలో ఒకరికి కరోనా.. ప్రయాణికులంతా క్వారంటైన్​​

ABOUT THE AUTHOR

...view details