ఓ శునకాన్ని లైంగికంగా వేధించిన ఘటన మహారాష్ట్ర ముంబయిలోని పొవాయ్ ప్రాంతంలో జరిగింది. ఓ శునకం సున్నిత భాగంలో కర్రను ఉంచి చిత్రహింసలు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శునకంపై లైంగిక దాడి- ఎవరిదీ పని? - Mumbai news
మూగజీవిపై లైంగిక దాడి జరిగిన ఘోరమైన ఘటన ముంబయిలో వెలుగులోకి వచ్చింది. ఓ శునకాన్ని చిత్రహింసలకు గురిచేశారు కొందరు ఆగంతుకులు. నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
![శునకంపై లైంగిక దాడి- ఎవరిదీ పని? Dog sexually assaulted in Mumbai, FIR registered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9303948-20-9303948-1603598346755.jpg)
మూగజీవిపై లైంగిక దాడి
తీవ్ర రక్తస్రావంతో ఉన్న కుక్కను ఇద్దరు మహిళలు గమనించి స్థానిక పశువైద్యశాలకు తీసుకెళ్లారు. మూగజీవి సున్నిత భాగంలో కర్రను దూర్చి వేధించారని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై బాంబే జంతు హక్కు చట్టం(బార్) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.