తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"దమ్ముంటే కేసు పెట్టు" - Anti National

ధైర్యముంటే తనపై దేశద్రోహం కేసు పెట్టాలని ప్రధానిమోదీకి సవాల్​ విసిరారు సీనియర్​ కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​ సింగ్​. పుల్వామా దాడిపై డిగ్గీ రాజా చేసిన ట్వీట్ భాజపా నేతలు దేశద్రోహం ఆరోపణలు చేసేందుకు దారితీసింది.

"దమ్ముంటే కేసు పెట్టు"

By

Published : Mar 6, 2019, 1:13 PM IST

ప్రధానమంత్రి మోదీకి దమ్ముంటే తనపై దేశద్రోహం కేసు పెట్టాలని సినీయర్​ కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​ సింగ్​ సవాల్ చేశారు. పుల్వామాపై ఆయన చేసిన ఒక ట్వీట్​తో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు దోశద్రోహం ఆరోపణలు చేస్తున్నారు.

వివాదం ఇది

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి విదేశీ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోందని నిన్న ఒక ట్వీట్​ చేశారు దిగ్విజయ్​. ఇందులో 'పుల్వామా దుర్ఘటన' అని సంబోధించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగ్విజయ్​ పాకిస్థాన్​కు మద్ధతిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు.

దిగ్విజయ్​ సింగ్​ కూడా వరుస ట్వీట్​లతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కూడా ఇలాంటి పదజాలాన్నే వాడారని దీనిపై భాజపా మౌనం వహిస్తోందని వ్యాఖ్యానించారు.

ఉగ్రదాడిని పెద్ద ప్రమాదంగా వ్యాఖ్యానిస్తున్న ఉత్తరప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య వీడియోను రీట్వీట్​ చేశారు.

మౌర్య గురించి మోదీ, మంత్రులు ఎమైనా మాట్లాడుతారా? - దిగ్విజయ్​ సింగ్​ ట్వీట్​

పుల్వామా దాడిలో నిఘ వర్గాల వైఫల్యంపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఉగ్రదాడికి ఎవరు బాధ్యులో దేశానికి మోదీ వెల్లడించాల్సి ఉంది. మోదీ ఏదైనా బాధ్యత తీసుకుంటారా? ఎన్​ఎస్​ఏ, ఐబీ, రా సారథుల నుంచి ఏమైనా వివరణ తీసుకున్నారా? - ట్విట్టర్​లో దిగ్విజయ్​ సింగ్​

ఇదీ చదవండి: ప్రమాదమా? దాడా?

ABOUT THE AUTHOR

...view details