తెలంగాణ

telangana

By

Published : Oct 28, 2019, 6:11 AM IST

Updated : Oct 28, 2019, 12:00 PM IST

ETV Bharat / bharat

దీపావళి రోజు స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ జవాన్లు

జమ్మూ అంతటా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. టపాసులు కాలుస్తూ యువత ఉత్సాహంగా పండుగ జరుపుకున్నారు. అయితే అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వద్ద మాత్రం భారత్​-పాక్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోలేదు. ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయాన్ని ఈసారి పాటించలేదు.

దీపావళి రోజు స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ జవాన్లు

వెలుగుల పండుగ దీపావళిని జమ్ము ప్రజలు అంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ), నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద భారత్​-పాక్ సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునే ఆనవాయితీని ఈసారి పాటించలేదని అధికారులు తెలిపారు.

"రాజౌరీ జిల్లా సుందర్​బనీ సెక్టార్​లోని నియంత్రణరేఖ వెంబడి పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఇది మినహా మరెక్కడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. దీపావళి వేడుకలు శాంతియుతంగా జరుగుతున్నాయి. జమ్మూ యువత దీపావళి టపాసులు పేల్చుతూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటున్నారు."- ఓ సైనికాధికారి

సైన్యం, బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ (బీఎస్​ఎఫ్​) సిబ్బంది.. సరిహద్దు కంచె వద్ద నిన్న రాత్రి దీపాలను వెలిగించారు. ఐబీ, నియంత్రణరేఖ వెంబడి పహారా కాస్తున్న సైనికుల్లో పండుగ ఉత్సాహం నెలకొందని సైనికాధికారులు తెలిపారు.

మిఠాయిలు పంచుకోలేదు..

భారత్​-పాక్ సరిహద్దులోని ఇరుదేశాల సైనికులు.. దీపావళి, ఈద్​, స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఈసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఆనవాయితీని పాటించలేదని అధికారులు తెలిపారు.

దాయాదుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దుల వెంబడి సైన్యం కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తోంది.

సత్యపాల్​మాలిక్ శుభాకాంక్షలు

జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్​మాలిక్​ .. ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కశ్మీర్​లో శాంతి, శ్రేయస్సు, పురోగతి నెలకొనాలని ఆకాంక్షించారు. దీపావళి.. మతసామరస్యం, సోదరభావం, స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు సత్యపాల్​.

ఇదీ చూడండి:పేదల పాలిట దేవుడు.. వారంలో ఆరురోజలు ఉచిత భోజనం!


Last Updated : Oct 28, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details