తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీటి వృథాకు శిక్షగా జరిమానా విధించుకున్న కలెక్టర్​

తన కార్యాలయంలో నీటి వృథాను గమనించిన ఓ అధికారి తనకు తానే జరిమానా విధించుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఘజియాబాద్​ జిల్లా మేజిస్ట్రేట్​ కార్యాలయంలో జరిగిందీ ఘటన. తనతో పాటు ఇతర అధికారులపై 10 వేల రూపాయల జరిమానా విధించడమే కాకుండా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించారు.

By

Published : Nov 6, 2019, 11:20 AM IST

నీటి వృథాకు శిక్షగా జరిమానా విధించుకున్న కలెక్టర్​

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ అధికారి తనకు తానే జరిమానా విధించుకున్నారు. ఘజియాబాద్​ జిల్లా మేజిస్ట్రేట్​ అజయ్​ శంకర్​ పాండే తనతో పాటు ఇతర అధికారులపై 10 వేల రూపాయలు జరిమానాగా విధించారు.

జిల్లా మేజిస్ట్రేట్​ కార్యాలయంలోని ఓ ఓవర్​హెడ్​ ట్యాంక్​లో నుంచి నీరు వృథాగా పోవడాన్ని గమనించి తనకు తాను జరిమానా వేసుకున్నట్లు పాండే వ్యక్తిగత సహాయకుడు గౌరవ్​ సింగ్ తెలిపారు. ట్యాంకు పొంగి పొర్లిన శబ్దాన్ని విని ఆయన నీటి వృథాని గమనించారని పేర్కొన్నారు. అయితే ఈ ఘటనపై చింతిస్తున్నట్లు తెలిపారు గౌరవ్​ సింగ్​. కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి జరిమానాను సమానంగా పంచుకొని ట్రెజరీలో డిపాజిట్​ చేస్తామని చెప్పారు.

నీటి వృథాని సహించేది లేదన్న శంకర్​ పాండే... ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని కలెక్టరేట్​ కార్యాలయ అధికారులను ఆదేశించారు. నీటి పొదుపు అనేది ప్రస్తుతం దేశానికి ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details