తెలంగాణ

telangana

By

Published : Jan 8, 2020, 7:30 AM IST

ETV Bharat / bharat

పారదర్శకత కోసం ఆ ఐఏఎస్​ల వివరాలు ఇవ్వండి!

గత పదేళ్లలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న ఐఏఎస్​ల వివరాలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది సమాచార కమిషన్​(సీఐసీ). పారదర్శకతను మరింత సుగమం చేసేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయని సీఐసీ పేర్కొంది.

ias
ఐఏఎస్​

కేంద్రానికి సమాచార కమిషన్​ (సీఐసీ)కీలక ఆదేశాలు జారీ చేసింది. గత పదేళ్ల కాలంలో క్రమశిక్షణ చర్యల ప్రక్రియను ఎదుర్కొన్న ఐఏఎస్‌ అధికారుల పేర్లను వెల్లడించాలని సూచించింది.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరాలను తెలియచేయాలని సమాచార కమిషనర్‌ దివ్య ప్రకాశ్‌ సిన్హా స్పష్టం చేశారు. ఈ తరహా చర్యలను ఎదుర్కొన్న సదరు ఐఏఎస్‌ల పేర్లను వెల్లడించడం పారదర్శకతకు మార్గం సుగమం చేస్తుందని సిన్హా పేర్కొన్నారు.

యూపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకుర్‌ భార్య, సామాజిక ఉద్యమకారిణి అయిన నూతన్‌ ఠాకుర్‌ చేసుకున్న ఆర్‌టీఐ అభ్యర్థనపై స్పందించిన సీఐసీ ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించింది.1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకుర్‌ సర్వీసులో ఉన్న సమయంలో పలు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం గమనార్హం.

ఇదీ చూడండి:కశ్మీర్​కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details