దేశ రాజధాని దిల్లీలో వాయునాణ్యత మళ్లీ క్షీణించింది. ఫిబ్రవరి తర్వాత తొలిసారి వాయునాణ్యత సూచీ 304గా నమోదైంది. పంజాబ్, హరియాణాతో పాటు పొరుగు దేశం పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడమే దీనికి ప్రధాన కారణమని కేంద్ర భూ విజ్ఞాన శాఖ తెలిపింది.
దిల్లీలో క్షీణించిన వాయునాణ్యత - వాయు నాణ్యత
దిల్లీలో వాయు నాణ్యత ఈ సీజన్లో తొలిసారి క్షీణించింది. మంగళవారం ఉదయం ఏక్యూఐ-304 గా నమోదైంది. పంజాబ్, హరియాణా రాష్ట్రల్లో వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం, కాలుష్య కారకాలు పెరిగిపోవడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.
![దిల్లీలో క్షీణించిన వాయునాణ్యత Delhi's air quality hits 'very poor' level, first time this season](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9156232-688-9156232-1602567206693.jpg)
ఈ సీజన్లో దిల్లీలో తొలిసారి క్షీణించిన వాయునాణ్యత
గాలులు ప్రశాంతంగా వీయడం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్ల కాలుష్య కారకాలు పెరిగినట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీలోని సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు.