దిల్లీ అల్లర్లకు ఆజ్యం పోస్తూ రాజకీయ నాయకులు చేసిన ద్వేషపూరిత ప్రసంగాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై మార్చి 12న విచారణ చేపడతామని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
పౌర చట్టం (సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య దిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఇదే సమయంలో హింసాత్మక చర్యలకు ఆజ్యంపోస్తూ కొందరు రాజకీయనేతలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఫలితంగా ఘర్షణలు మరింత ఉద్రిక్తమై 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో బాధ్యులైన రాజకీయ నేతలను అరెస్టు చేయాలంటూ దిల్లీ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మార్చి 12న వీటిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం.