తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 6:49 PM IST

ETV Bharat / bharat

భారత్​పై కరోనా పంజా.. 91వేలకు చేరువలో కేసులు

దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దేశవ్యాపంగా దాదాపు 91వేల మందికి సోకిందీ మహమ్మారి​. ఒక్కరోజే 120 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా వైరస్​ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 2,872 కు చేరింది. కొత్త కేసులు దాదాపు 5వేలు నమోదయ్యాయి.

Delhi COVID-19 toll nears 150; total cases 9,755
భారత్​పై కరోనా పంజా.. 91వేలకు చేరువలో కేసులు

భారత్​లో.. కరోనా కేసులు 91వేలకు చేరువయ్యాయి. ఒకేరోజు దాదాపు 5వేల కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆదివారం ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,927వేలకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇందులో 53, 946 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు మరో 34,108 మంది కోలుకున్నారు. 2,872మంది మరణించారు.

రాష్ట్రాలను ఊపిరాడనీక..

రోజూ రోజూకూ పెరుగుతున్న కేసులతో.. భారత రాష్ట్రాలపై కరోనా పంజా విసురుతోంది. ఒక్క మహారాష్ట్రలోనే సుమారు 30,706 మందికి సోకిన ఈ మహమ్మారి.. గుజరాత్​, తమిళనాడులో పదివేల మందికి పైగా వ్యాపించింది. ఇక దిల్లీలోనూ కేసుల సంఖ్య 10వేలకు చేరువలో ఉంది.

రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​లో 5వేలకు సమీపంలో వైరస్​ కేసులు నమోదయ్యాయి. బంగాల్​, ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​లలో దాదాపు 2వేల పాజిటివ్​ కేసులుండగా.. తెలంగాణ, బిహార్​, జమ్ముకశ్మీర్​లలో వెయ్యి కేసులు దాటేశాయి.

ఒడిశా, కేరళ రాష్ట్రాల్లో 5 వందలకు పైగా కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. ఝార్ఖండ్​, ఛండీ​గఢ్, త్రిపుర​లో 200కు అటూ, ఇటుగా ఉన్నాయి. అసోం, ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​,ఛత్తీస్​గఢ్​, లద్ధాఖ్​లలో 100లోపు కేసులు నమోదయ్యాయి..

ఒక్క రోజులో..!

దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 120 మంది వైరస్​తో పోరాడుతూ కన్నుమూశారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 5వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రాలు వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు మరింత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

దిల్లీ- ఒకే రోజులో కొత్తగా 422 కరోనా కేసులు నమోదయ్యాయి. 19 మంది వైరస్ ​ధాటికి మరణించారు.

రాజస్థాన్​- ఒక్క రోజులో 123 కొత్త కేసులు నమోదు కాగా, వీరిలో 14 మంది జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలే. చికిత్స పొందుతున్న ఇద్దరు బాధితులు మృతి చెందారు.

ఒడిశా- శుక్రవారం ఉదయానికి కొత్తగా 91 మందికి కరోనా సోకింది. వైరస్​తో పోరాడుతూ ఇద్దరు మృతిచెందారు.

మధ్యప్రదేశ్​- ఇండోర్​లో మరో 92మందికి మహమ్మారి సోకింది. చికిత్స పొందుతున్న ఓ బాధితుడు వైరస్​కు బలయ్యాడు. దీంతో ఆ జిల్లాలో కర్ఫ్యూ కట్టుదిట్టం చేసి, వైరస్​ వ్యాప్తిని అదుపుచేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.

కర్ణాటక- 24 గంటల్లో 54 పాజిటివ్​ కేసులు బయటపడగా.. వీరిలో 10 మంది చిన్నారులే కావడం విషాదకరం. ఓ బాధితుడు మృతి చెందాడు.

బిహార్​-మరో 33 కొవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

అసోం- కొత్తగా నాలుగు కేసులు నమోదైనట్లు అసోం ఆరోగ్య శాఖ మంత్రి బిస్వా శర్మ వెల్లడించారు. కేసులు వందకు చేరువవుతుండం వల్ల ప్రభుత్వం పిల్లలు, వృద్ధులను ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది.

వలసకూలీలపై కన్నెర్ర..

బతుకుదెరువు కోసం ఊరు గాని ఊరుకి వెళ్లి ఉపాధి కోల్పోయి తిరిగి ఇంటిబాటపట్టిన వలసలపై కరోనా కన్నెర్ర జేసింది. శనివారం ఒక్కరోజే బిహార్​ రాష్ట్రంలో 560 వలస కూలీలకు వైరస్​ పాజిటివ్​గా తేలింది. వీరంతా దిల్లీ, మహారాష్ట్ర, బంగాల్​ రాష్ట్రాలకు వలస వెళ్లి లాక్​డౌన్​ కారణంగా తిరిగివచ్చినవారే. వారందరినీ క్వారంటైన్​లో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో 2,746 మంది వలసదారుల కరోనా పరీక్షా ఫలితాలు వెలువడాల్సి ఉంది.

ఇదీ చదవండి:భారత్ భూభాగం​లోకి చొచ్చుకొచ్చిన చైనా చాపర్లు!

ABOUT THE AUTHOR

...view details