తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆమ్​ఆద్మీ​ ఎమ్మెల్యేకు 3 నెలల జైలు శిక్ష

ఆమ్​ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మనోజ్​ కుమార్​కు 3 నెలల జైలు శిక్ష విధించింది దిల్లీలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే ఫాస్ట్​ ట్రాక్​ న్యాయస్థానం. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ నిర్వహణను అడ్డుకున్నందుకు ఈ మేరకు తీర్పునిచ్చింది కోర్టు.

By

Published : Jun 25, 2019, 3:04 PM IST

ఆమ్​ఆద్మీ​ ఎమ్మెల్యేకు 3 నెలల జైలు శిక్ష

2013 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ నిర్వహణను అడ్డుకున్న కేసులో ఆమ్​ఆద్మీ ఎమ్మెల్యే మనోజ్​ కుమార్​కు 3 నెలల జైలు శిక్ష పడింది. దిల్లీలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే ఫాస్ట్​ ట్రాక్ కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసుకునేందుకు రూ.10,000 పూచికత్తుతో ఎమ్మెల్యేకు బెయిల్​ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్​ 131, భారత శిక్షాస్మృతిలోని 186 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, పోలింగ్​ కేంద్రాల వద్ద దురుసుగా ప్రవర్తించడాన్ని నేరంగా పరిగణిస్తూ మనోజ్​ కుమార్​ను దోషిగా తేల్చింది.

ఏం జరిగింది..?

2013 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ కేంద్రంగా ఉన్న ఎమ్​సీడీ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద 50 మందితో మనోజ్​ కుమార్​ నిరసన చేపట్టినట్లు ఆయనపై కేసు నమోదైంది. ఆయన నిరసన వల్ల ఓటర్లు, పోలింగ్​ యంత్రాంగానికి సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details