తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2020, 4:19 PM IST

Updated : Feb 29, 2020, 1:02 PM IST

ETV Bharat / bharat

నిర్భయ కేసు: తీహార్​ జైలు అధికారుల పిటిషన్​ కొట్టివేత

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు కొత్త తేదీని ప్రకటించాలని తీహార్​ జైలు అధికారులు వేసిన పిటీషన్​ను దిల్లీ కోర్టు తోసిపుచ్చింది. దోషులు జీవించేందుకు చట్టం అనుమతించిన తర్వాత వారిని ఉరితీయటం నేరపూరిత పాపమని అభిప్రాయపడింది.

Delhi court dismisses Tihar's plea seeking fresh date for execution of convicts
నిర్భయ దోషులు: తీహార్​ జైలు అధికారుల పిటిషన్​ కొట్టివేత

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీసేందుకు కొత్త తేదీ ప్రకటించాలని తీహార్​ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను పటియాలా హౌజ్​ కోర్టు తోసిపుచ్చింది. దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని ఈనెల 5న దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన న్యాయమూర్తి.. దోషులు జీవించేందుకు చట్టం అనుమతించిన తర్వాత కూడా వారిని ఉరితీయటం నేరపూరిత పాపమవుతుందన్నారు.

ఊహాజనిత సమాచారం ఆధారంగా డెత్‌ వారెంట్‌ జారీ చేయకూడదన్న దోషుల తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవిస్తూ.. తిహార్​ జైలు అధికారుల పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు జడ్జి తీర్పునిచ్చారు. అయితే అవసరమైనప్పుడు పిటిషన్‌ దాఖలు చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: విమానాశ్రయంలో 'ఎలుగుబంటి' డ్యూటీ!

Last Updated : Feb 29, 2020, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details