తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సక్సేనా వాంగ్మూలం 5న

అగస్టా కేసులో అప్రూవర్​గా మారి తనకు తెలిసిన సమాచారమంతా వెల్లడిస్తానని కోర్టుకు విన్నవించారు సక్సేనా.

By

Published : Mar 3, 2019, 6:45 AM IST

Updated : Mar 3, 2019, 8:08 AM IST

సక్సేనా వాంగ్మూలం 5న

అగస్టా వెస్ట్​లాండ్ మనీ లాండరింగ్​ కేసులో అప్రూవర్​గా మారతానన్న వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్​ ముందు మార్చి 5న రికార్డు చేయాలని రాజీవ్​ సక్సేనాకు దిల్లీకోర్టు ఆదేశించింది.

మార్చి 2నే వాంగ్మూలాన్ని సక్సేనా సమర్పించాల్సింది. ఆరోగ్యం సరిగా లేనందున మార్చి5కు మార్చాలనే వినతికి న్యాయస్థానం అంగీకరించింది.
రూ.3వేల600 కోట్ల అగస్టా వెస్ట్​లాండ్ మనీ లాండరింగ్ కేసు నిందితుల్లో రాజీవ్​ సక్సేనా ఒకరు.

ఈ కేసులో అప్రూవర్​గా మారి తనకు తెలిసిన సమాచారమంతా వెల్లడించి విచారణకు పూర్తిగా సహకరిస్తానని గతవారం కోర్టును అభ్యర్థించారు సక్సేనా.

Last Updated : Mar 3, 2019, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details