తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలిసారిగా కామన్వెల్త్ యూత్​ పార్లమెంట్​కు భారత్​ ఆతిథ్యం - Delhi Assembly first in India to host Commonwealth Youth Parliament

లోక్​సభ, దిల్లీ అసెంబ్లీ కలిసి మొదటిసారి కామన్వెల్త్​ యూత్ పార్లమెంట్​కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నవంబర్​ 25 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో కామన్వెల్త్​ దేశాలకు చెందిన 47 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, చట్టసభల ప్రాధాన్యం, ఉద్దేశాలపై యువతకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్​ నివాస్​ గోయల్ పేర్కొన్నారు.

తొలిసారిగా కామన్వెల్త్ యూత్​ పార్లమెంట్​కు భారత్​ ఆతిథ్యం

By

Published : Nov 23, 2019, 10:01 PM IST

నవంబర్​ 25 నుంచి మూడు రోజులపాటు జరిగే కామన్వెల్త్ యూత్​ పార్లమెంట్​కు మొదటిసారిగా లోక్​సభ, దిల్లీ శాసనసభ కలిసి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ కార్యక్రమంలో 24 కామన్వెల్త్​ దేశాల నుంచి 47 మంది ప్రతినిధులు పాల్గొంటారని, వీరిలో భారత్​ నుంచి 11 మంది ఉన్నారని.. దిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్​ నివాస్ గోయల్ తెలిపారు.

అవగాహన కల్పించేందుకు..

సోమవారం ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా దిల్లీ శాసనసభలో మాక్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఇందులో పార్లమెంటరీ అధికారులు, యువనాయకులు, 18 నుంచి 29 ఏళ్ల విద్యార్థినీవిద్యార్థులు పాల్గొంటారు.

శాసన ప్రక్రియలపై యువతకు అవగాహన కల్పించడానికి, చట్టసభల విధానాలు, నిర్ణయాధికారాల్లో యువత పాల్గొనేలా ప్రోత్సహించడమే ఈ యూత్ పార్లమెంట్ ఉద్దేశమని గోయల్ స్పష్టం చేశారు. అలాగే ప్రజాస్వామ్యం, సుపారిపాలనలో చట్టసభల ప్రాధాన్యం, ఉద్దేశ్యం యువతకు తెలియజేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: సుప్రీంకోర్టుకు చేరిన మహారాష్ట్ర రాజకీయాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details