తెలంగాణ

telangana

By

Published : Feb 5, 2020, 5:41 AM IST

Updated : Feb 29, 2020, 5:41 AM IST

ETV Bharat / bharat

నేడు డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో​ జరిగే డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దేశ సామర్థ్యాన్ని చాటాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 5 రోజులపాటు జరిగే డిఫెన్స్​ ఎక్స్​పోలో వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొని తమ ఆయుధాలను ప్రదర్శించనున్నాయి.

DefExpo to open Wednesday by pm modi, focus on showcasing India's potential to become manufacturing hub
నేడు డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

నేడు డిఫెన్స్​ ఎక్స్​పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

రెండేళ్లకు ఓసారి నిర్వహించే డిఫెన్స్ ఎక్స్​పో ఇండియా-2020ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూకు వెళ్లనున్నారు మోదీ. ఐదు రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొననున్నాయి.

ఏమిటీ ఈ ఎక్స్​పో?

'ఇండియా-ద ఎమర్జింగ్ డిఫెన్స్‌ మ్యానుఫాక్ఛరింగ్​ హబ్‌' అనే ఇతివృత్తంతో డిఫెన్స్ ఎక్స్‌పో ఇండియా-2020ని నిర్వహిస్తున్నారు. నూతన సాంకేతికత, సాంకేతిక సమస్యలకు పరిష్కారం సహా రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులు ప్రదర్శించడానికి ఒక వేదికను అందించేలా చేయడమే ప్రధాన అజెండాగా 11వ విడత డిఫెన్స్​ ఎక్స్​పో జరగనుంది. 'డిజిటల్ ట్రాన్స్​ఫార్మేషన్​ ఆఫ్​ డిఫెన్స్'​ అంశంపై ప్రధాన దృష్టి కోణంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో 70 దేశాలకు చెందిన ప్రతినిధులు, 172 విదేశీ రక్షణ రంగ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. మనదేశంలోని 856 రక్షణ రంగ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

'దేశ సామర్థ్యాన్ని చాటేందుకే'

రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో దేశ సామర్థ్యాన్ని చాటాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. పెద్ద ఎత్తున విదేశీ సంస్థలు ఇందులో పాల్గొనడం భారత్​ ఎదుగుదలను సూచిస్తోందని పేర్కొన్నారు.

"భారత్​ను రక్షణ ఉత్పత్తుల తయారీ హబ్​గా మార్చాలనుకుంటున్నాం. దీనికి డిఫెన్స్​ ఎక్స్​పో ఓ ఉత్తమ వేదిక. ఈ దశాబ్దం చివరికల్లా ప్రపంచలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది. ఇందులో రక్షణ రంగం ముఖ్య భూమిక పోషిస్తుంది."
-రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

భారత్​-రష్యా మిలిటరీ సదస్సు..

డిఫెన్స్​ ఎక్స్​పోతో పాటు భారత్​-రష్యా మధ్య జరిగే ఐదో విడత మిలిటరీ ఇండస్ట్రీ సదస్సును నిర్వహించనున్నారు. 100 మంది రష్యా ప్రతినిధులు, 200 మంది భారత ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం కానున్నారు.

ప్రదర్శనలో ఇవి

భారత్‌కు విక్రయించాలని భావిస్తున్న ఫ్రాన్స్‌, అమెరికాకు చెందిన యుద్ధవిమానాలు కూడా ప్రదర్శనకు వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు సుఖోయ్‌ 30ఎంకేఐ, జాగ్వార్‌, చినూక్‌, చీతా హెలికాప్టర్లు కూడా ప్రదర్శనకు ఉంచే అవకాశముంది.

డిఫెన్స్ ఎక్స్​పో కారణంగా దాదాపు 90 విమానాల రాకపోకలు ప్రభావితం కానున్నాయి. డిఫెన్స్ ఎక్స్​పో సమయంలో గంటకు 2,700 కిలోమీటర్ల వేగంతో యుద్ధవిమానాలు ప్రయాణించనుండటం వల్ల విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

ఇదీ చదవండి: పవన్​తో సినిమాపై స్పందించిన హరీశ్​ శంకర్​

Last Updated : Feb 29, 2020, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details