తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తేజస్​లో ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతి' - Defence Minister Rajnath Singh tejas

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్​సీఏ తేజస్​లో విహరించిన అనుభూతి గొప్పగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్. తేజస్​లో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా అరుదైన గౌరవం పొందారు.

తేజస్​ యుద్ధ విమానంలో రాజ్​నాథ్​ ప్రయాణం

By

Published : Sep 19, 2019, 10:43 AM IST

Updated : Oct 1, 2019, 4:18 AM IST

తేజస్​లో ప్రయాణించిన రాజ్​నాథ్

దేశీయంగా రూపొందించిన లైట్‌ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్‌లో ప్రయాణించిన తొలి రక్షణశాఖ మంత్రిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు రాజ్‌నాథ్ సింగ్. బెంగళూరులోని హెచ్​ఏఎల్ విమానాశ్రయంలో అధికారుల సమక్షంలో తేజస్‌లో విహరించారు. ప్రత్యేక అనుభూతి పొందినందుకు సంతోషం వ్యక్తం చేశారు రాజ్​నాథ్​. ఈ అనుభవాన్ని జీవితంలో మర్చిపోనని చెప్పారు. రాజ్​నాథ్​తో పాటు ఎయిర్‌ వైస్ మార్షల్ తివారీ తేజస్‌లో ప్రయాణించారు.

స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్‌ను రూపొందించిన అధికారుల కృషిని ప్రశంసించేందుకు అందులో ప్రయాణించినట్లు తెలిపారు రాజ్​నాథ్.

" తేజస్ యుద్ధవిమానం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. తేజస్​లో​ ప్రయాణించే అవకాశం తొలిసారి దక్కింది. ప్రయాణం చాలా సాఫీగా సాగింది. సౌకర్యంగా ఉంది. నేను ఆస్వాదించా. హెచ్​ఏఎల్​, డీఆర్​డీవో అందరికీ అభినందనలు. తేజస్ కావాలని ఇతర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు యుద్ధ విమానాలు, ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగాం. "

-రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇప్పటికే భారతీయ వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. నౌకాదళంలో ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది..

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ అమలు చేస్తాం : అమిత్​ షా

Last Updated : Oct 1, 2019, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details