తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశానికి గ్రీన్ ​సిగ్నల్​

బాలికలకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాలల్లో ప్రవేశం కల్పించడానికి రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ అనుమతి మంజూరు చేశారు. ఇందుకోసం సైనిక పాఠశాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, తగినంత మంది మహిళా సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Oct 18, 2019, 11:46 PM IST

సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశానికి రాజ్​నాథ్​సింగ్ అనుమతి

2021-22 విద్యా సంవత్సరం నుంచి సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించడానికి రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​ అనుమతించారు. సైనిక విద్యాసంస్థల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని.. తగినంతమంది మహిళా సిబ్బందిని నియమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రెండేళ్ల క్రితం మిజోరంలోని చింగ్​చిప్​ సైనిక పాఠశాలలో బాలికలను చేర్పించడానికి రక్షణమంత్రిత్వశాఖ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన నేపథ్యంలో రాజ్​నాథ్​ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

"సైనిక పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం కల్పించాలనే నిర్ణయం మరింత సమగ్రంగా.. లింగసమానత్వానికి, సాయుధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించడానికి వీలుకల్పిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం చేసిన 'బేటీ బచావో, బేటీ పడావో' నినాదాన్ని బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది." - రాజ్​నాథ్​సింగ్, రక్షణమంత్రి

ప్రభుత్వ పాఠశాల విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి, గరిష్ఠ సంఖ్యలో క్యాడెట్లను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి పంపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సైనిక పాఠశాలలను రూపొందించింది.

ఇదీ చూడండి:ప్రత్యేక రైలులో విహారం.. బుద్ధుడి చారిత్రక ప్రదేశాల వీక్షణం

ABOUT THE AUTHOR

...view details