తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2019, 6:27 PM IST

Updated : Nov 2, 2019, 8:46 PM IST

ETV Bharat / bharat

'మహా'పీఠం: శివసేనకు కాంగ్రెస్​ మద్దతుపై కొత్త చర్చ

మహారాష్ట్రలో రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనకు మద్దతిచ్చే విషయంపై ఆలోచించాలని కాంగ్రెస్ ఎంపీ దల్వాయి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. దీన్ని స్వాగతిస్తున్నామని సేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. మరోవైపు నవంబరు 10లోపు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా నేత ముంగన్​తివార్ విశ్వాసంగా చెప్పారు.

'మహా'పీఠం: శివసేనకు కాంగ్రెస్​ మద్దతుపై కొత్త చర్చ

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతున్నాయి. సీఎం పీఠాన్ని చెరిసగం పంచుకోవాలనే విషయంపై శివసేన వెనక్కి తగ్గడం లేదు. ఈ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని భాజపా ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనకు కాంగ్రెస్​ మద్దతివ్వడంపై కొత్త చర్చ మొదలైంది.

శివసేనకు మద్దతివ్వాలని సోనియాకు లేఖ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనకు మద్దతిచ్చే విషయంపై ఆలోచించాలని కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు ఆ పార్టీ ఎంపీ హుస్సేన్ దల్వాయి. భాజపా అతివాదంతో పోల్చితే శివసేన భావజాలం వేరు అని లేఖలో పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్​ నామినేట్ చేసిన రాష్ట్రపతి అభ్యర్థులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలకు సేన మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు దల్వాయి.

అయితే... శివసేనకు మద్దతిచ్చే ప్రతిపాదనను కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున ఖర్గే, సుశీల్​ కుమార్​ శిందే, సంజయ్​ నిరుపమ్​ వంటి నాయకులు ఈ జాబితాలో ఉన్నారు.

స్వాగతించిన సేన

దల్వాయి లేఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు శివసేన నేత సంజయ్ రౌత్. ఆయన సామాజిక భావజలాలు కల్గినవారని, ప్రగతి శీల కుటుంబం నుంచి వచ్చారని కొనియాడారు.

భాజపాతో ప్రతిష్టంభనపైనా స్పందించారు రౌత్. తమ పార్టీ భాజపాతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిందని, చివరి వరకు పొత్తు ధర్మానికే కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా ఇప్పటి వరకు తమతో సంప్రదింపులు జరపలేదని చెప్పారు.

వారం రోజుల్లో సేనతో కలిసి...

నవంబరు 10లోపు శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసంగా చెప్పారు భాజపా నేత సుధీర్​ ముంగన్​తివార్​.

మహారాష్ట్రలో నిర్దిష్ట గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన రావొచ్చని ఇటీవల సుధీర్​ చేసిన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడింది సేన. ఆయనపై విమర్శలు గుప్పిస్తూ సామ్నా పత్రికలో వ్యాసాన్ని ప్రచురించింది. ఇప్పుడు శివసేనతో కలిసి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సుధీర్​ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు'

Last Updated : Nov 2, 2019, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details