తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2021, 9:35 AM IST

ETV Bharat / bharat

మరోసారి భగ్గుమన్న పెట్రోల్​, డీజిల్ ధరలు​

దేశంలో చమురు ధరలు మరోసారి భగ్గుమన్నాయి. శుక్రవారం పెట్రోలు, డీజిల్​ ధరలు లీటర్​కు 25 పైసల చొప్పున పెరిగాయి.

Crude oil prices have risen again in the country
మరోసారి భగ్గుమన్న పెట్రోల్​, డీజిల్​-తాజా ధరలివే

దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్​ ధరలను మరోసారి పెంచుతూ ఆయిల్​ కంపెనీలు తాజాగా నిర్ణయం తీసుకున్నాయి.

శుక్రవారం పెట్రోలు, డీజిల్​ ధరలు లీటర్​కు 25 పైసల చొప్పున పెరిగాయి. 10 రోజుల వ్యవధిలో చమురు ధరల్లో రూపాయికి పైగా పెరుగుదల కనిపించింది. దిల్లీలో పెట్రోల్ ధర రూ.85.45 గా ఉంది. డీజిల్​ ధర రూ.75.63కి చేరింది.

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్​ పెట్రోల్ ధర​ రూ.92 దాటింది. డీజిల్ ధర రూ.82.40గా ఉంది.

ఇదీ చదవండి:కొంపముంచిన ఆన్​లైన్ స్నేహం- బాలికపై గ్యాంగ్​ రేప్​

ABOUT THE AUTHOR

...view details