తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సహచర జవాన్లనే కాల్చి చంపిన సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​

జమ్ముకశ్మీర్​ ఉధమ్​పుర్​ సీఆర్​పీఎఫ్​ శిబిరంలో తోటి జవాన్లనే కాల్చి చంపాడో కానిస్టేబుల్​. స్థానిక 187వ బెటాలియన్​ శిబిరం​లో చిన్న ఘర్షణే ముగ్గురి మృతికి కారణమైంది. అనంతరం తానూ కాల్చుకున్నాడు నిందితుడు. ప్రస్తుతం మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉంది.

By

Published : Mar 21, 2019, 6:00 AM IST

జమ్ము ఉధమ్​పుర్​ సీఆర్​పీఎఫ్​ శిబిరంలో కాల్పులు

జమ్ము ఉధమ్​పుర్​ సీఆర్​పీఎఫ్​ శిబిరంలో కాల్పులు
జమ్ము కశ్మీర్​ ఉధమ్​పుర్​ ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. స్థానిక సీఆర్​పీఎఫ్​ శిబిరంలో... జవాన్ల మధ్య ఘర్షణ ముగ్గురి ప్రాణాల్ని బలితీసుకుంది. 187వ బెటాలియన్​ శిబిరంలో అజిత్​ కుమార్​ అనే కానిస్టేబుల్​ ముగ్గురు సహచర జవాన్లను కాల్చి చంపాడు. అనంతరం తానూ కాల్చుకున్నాడు.

ఇదీ చూడండి:అధికారం కోసం కాంగ్రెస్​ ఎంతకైనా తెగిస్తుంది: మోదీ

ప్రస్తుతం అజిత్​ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఇతన్ని ఉత్తరప్రదేశ్​ కాన్పుర్​కు చెందినవాడిగా గుర్తించారు.

మృతులనురాజస్థాన్​కు చెందిన హెడ్​ కానిస్టేబుల్​ పోకర్మాల్​, దిల్లీకి చెందిన యోగేంగ్ర శర్మ, హరియాణాకు చెందిన ఉమెద్​ సింగ్​లుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details