తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు​.. జవాను మృతి - ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు​.. జవాను మృతి

ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్​, సీఆర్​పీఎఫ్​ జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఎన్​కౌంటర్​లో కొంతమంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

ఛత్తీస్​గఢ్​లో ఎదురుకాల్పులు​.. జవాను మృతి

By

Published : Nov 7, 2019, 12:06 PM IST


ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో నక్సల్స్-​ పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడు. కొందరు మావోయిస్టులు కూడా హతమైనట్లు అనుమానిస్తున్నారు. బీజాపూర్‌ జిల్లా తంగుదా-పమేద్‌ ప్రాంతంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

మృతి చెందిన జవాన్‌ సీఆర్‌పీఎఫ్‌ 151వ బెటాలియన్‌కు చెందినట్లు గుర్తించారు అధికారులు. కమాండోలు, కోబ్రా, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహిస్తుండగా.. ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు అధికారులు చెప్పారు. ఇరువైపుల నుంచి జరిగిన కాల్పుల్లో జవాన్‌ మృతి చెందినట్లు తెలిపారు.

దంతెవాడ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు నక్సలైట్లను మట్టుబెట్టారు జవాన్లు.

ఇదీ చూడండి:'అయోధ్య' తీర్పుపై అనవసర వ్యాఖ్యలు వద్దు: మోదీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details