తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్నారి ఆకలి కన్నీరును తుడిచిన ​ జవాను

జమ్ముకశ్మీర్​లో హవల్దార్​ ఇక్బాల్​ సింగ్​ అనే సీఆర్​పీఎఫ్​ జవాను మానవత్వాన్ని చాటిచెప్పాడు. ఆకలితో ఉన్న ఓ చిన్నారికి స్వయంగా అన్నం తినిపించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.

By

Published : May 15, 2019, 6:15 AM IST

Updated : May 15, 2019, 8:01 AM IST

చిన్నారి ఆకలి కన్నీరును తుడిచిన ​ జవాను

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో ఓ సీఆర్​పీఎఫ్​ జవాను మానవత్వాన్ని చాటుకున్నాడు. సైనికులు శత్రువుల గుండెల్లో తూటాలు దింపటమే కాదు.. ఆకలిగా ఉన్నవారిని అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు హవల్దార్​ ఇక్బాల్​ సింగ్​.

చిన్నారి ఆకలి కన్నీరు చూసి...

శ్రీనగర్​లో సోమవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆకలితో ఉన్న ఓ చిన్నారిని చూశాడు ఇక్బాల్​. వెంటనే తన భోజనాన్ని బాలుడికి ఇవ్వడానికి ప్రయత్నించాడు. పక్షవాత బాధితుడైన చిన్నారి సొంతంగా తినలేని పరిస్థితిని గ్రహించిన ఇక్బాల్​... క్షణం ఆలస్యం చేయకుండా స్వయంగా భోజనం తినిపించాడు. మంచినీరు అందించి... చిన్నారి ఆకలిని తీర్చాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. జవాను చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మానవత్వం చాటిన ఇక్బాల్​ను పారామిలిటరీ దళాల అత్యున్నత అవార్డు 'డైరెక్టర్​ జనరల్​ కమెండేషన్​ డిస్క్​' వరించింది.

ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ కాన్వాయ్​పై ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో వాహణశ్రేణిలోని ఓ వాహనాన్ని నడిపాడుఇక్బాల్.

ఇదీ చూడండి: కోల్​కతాలో అమిత్​షా కాన్వాయ్​పై రాళ్లదాడి

Last Updated : May 15, 2019, 8:01 AM IST

ABOUT THE AUTHOR

...view details