తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దంతేరాస్ వేళ పసిడి కొనడం మంచిదంటే.. కొట్టేశారు! - bihar patna chori

దంతేరాస్ వేళ పసిడి కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. ఇదే సరైన సమయం అనుకున్న కొంతమంది దొంగలు.. బిహార్​లోని ఓ నగల దుకాణంలో చొరబడ్డారు. ఒకర్ని చంపి.. షాపు యజమానిని, సిబ్బందిని, కొనుగోలుదారులను భయభ్రాంతులకు గురిచేసి.. రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని దోచుకుని పరారయ్యారు.

దంతేరాస్ వేళ పసిడి కొంటే మంచిదంటే.. కొట్టేశారు!

By

Published : Oct 26, 2019, 12:07 PM IST

Updated : Oct 26, 2019, 2:11 PM IST

దంతేరాస్ వేళ పసిడి కొనడం మంచిదంటే.. కొట్టేశారు!

దీపావళి దంతేరాస్.. అనగానే నగల దుకాణాల్లో మహిళల సందడి నెలకొంటుంది. బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంట అడుగుపెడుతుంది అన్న నమ్మకం వల్ల దంతేరాస్ రోజు నగల దుకాణాలు కిటకిటలాడుతూ ఉంటాయి. ఇదే అదునుగా చూసుకొన్న ఓ దొంగల ముఠా బిహార్​లోని ఓ నగల దుకాణంలో చొరబడి రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసే పసిడిని ఎత్తుకెళ్లింది.

బిహార్​ రాజధాని పట్నాలోని అగమ్​కువా ప్రాంతం... భగవత్​ నగర్​లోని ఓ నగల దుకాణం నిన్న కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. అప్పుడే దుకాణంలోకి ముసుగులు ధరించి కొంతమంది చొరబడ్డారు. తుపాకితో కాల్పులు జరిపి.. భయభ్రాంతులకు గురిచేశారు. దొంగలని గ్రహించిన సిబ్బంది ప్రతిఘటించేందుకు యత్నించారు. దొంగలు కాల్పులు జరిపి ఒకరిని పొట్టన పెట్టుకున్నారు. రూ. 2.5 లక్షల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకుని పరారయ్యారు.

చోరీపై దర్యాప్తు చేస్తున్నామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు ఎస్ఎస్​పీ గరిమా మల్లిక్. బిహార్​లో చోరీలు యథేచ్చగా సాగుతున్నాయని... పోలీసులు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: తాజా ఫలితాలతో ప్రాంతీయ శక్తుల్లో నూతనోత్తేజం!

Last Updated : Oct 26, 2019, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details