తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ భేటీ

దిల్లీలో నేడు కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. 17వ లోక్​సభకు ఎన్నికైన కాంగ్రెస్​ ఎంపీలందరూ హాజరుకానున్నారు. ఈ భేటీలోనే నూతన​ లోక్​సభాపక్షనేతను ఎన్నుకునే అవకాశముంది.

By

Published : Jun 1, 2019, 7:02 AM IST

నేడు కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ భేటీ

నేడు కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ భేటీ

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్​ ఎంపీలందరూ నేడు సమావేశం కానున్నారు. ఈ కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీలోనే నూతన లోక్​సభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.

యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. ప్రస్తుతం సీపీపీకి నేతృత్వం వహిస్తున్నారు. నేడు జరగనున్న సమావేశానికి ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున గెలిచిన 52 మంది లోక్​సభ ఎంపీలతో పాటు.. పార్టీ రాజ్యసభ సభ్యులూ హాజరుకానున్నారు.

పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో ఈ భేటీ జరగనుంది. తదుపరి పార్లమెంట్​ సమావేశాల్లో కాంగ్రెస్​ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఇక్కడ చర్చించనున్నారు.
17వ లోక్​సభ ఏర్పాటైన అనంతరం జరగనున్న కాంగ్రెస్​ తొలి అధికారిక సమావేశం ఇదేనని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాహుల్​ హాజరు...

సీపీపీ భేటీకి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ హాజరుకానున్నారు. పార్టీ​ అధ్యక్ష పదవికి రాహుల్​ రాజీనామా ప్రతిపాదన చేసిన అనంతరం జరగనున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.

మే 25న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనే కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాహుల్​ గాంధీ రాజీనామా ప్రతిపాదన చేశారు. ఏకగ్రీవంగా తిరస్కరించిన కమిటీ.. అధ్యక్షుడిగా రాహుల్​నే ఉండాలని కోరింది. అనంతరం.. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, ఇతర పార్టీ నేతలూ రాహుల్​ గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని గళం వినిపించారు.

ABOUT THE AUTHOR

...view details