తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 8:15 PM IST

Updated : Jun 23, 2020, 9:35 PM IST

ETV Bharat / bharat

కరోనా కేసుల్లో తమిళనాడును దాటేసిన దిల్లీ

భారత్​లో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది. వైరస్​ కేసుల విషయంలో తమిళనాడును దాటేసి... దేశంలోనే రెండో స్థానానికి ఎగబాకింది రాజధాని దిల్లీ. ఇవాళ దాదాపు 4 వేల కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్​ల్లోనూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

COVID19: Delhi replaces Tamil Nadu to become 2nd worst hit in nation
కరోనా కేసుల్లో తమిళనాడును దాటేసిన దిల్లీ

దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో తాజాగా 3,947 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,602కు చేరి... దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. మరో 68 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 2301కు పెరిగింది.

మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతం

దేశంలోనే కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉంది మహారాష్ట్ర. మరణాలూ అధికంగానే నమోదవుతున్నాయి. తాజాగా 3,214 మందికి కరోనా సోకింది. మరో 248 మంది వైరస్​తో మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 1,39,010కు చేరగా... మరణాల సంఖ్య 6531కు పెరిగింది.

శివసేన పార్టీ ఆఫీస్​ సీల్​..

మహారాష్ట్ర ముంబయిలో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. నాలుగు రోజుల క్రితం పార్టీ భవన్​ను సందర్శించిన ఓ సీనియర్​ పార్టీ నేతకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడమే కారణం.

తమిళనాడులో 2వేలకు పైనే..

తమిళనాడులో కొత్తగా 2,516 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 39 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 64,603 మందికి వైరస్​ సోకగా.. 833 మంది మరణించారు.

గుజరాత్​ విలవిల

తాజాగా 549 మందికి వైరస్​ సోకడం వల్ల గుజరాత్​లో మొత్తం కేసుల సంఖ్య 28,429కు చేరింది. మరో 26 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,711కు పెరిగింది.

మిగతా రాష్ట్రాల్లో..

  • కర్ణాటకలో తాజాగా 322 కేసులు నమోదయ్యాయి. 8మంది వైరస్​తో మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,721కి చేరింది. మరణాల సంఖ్య 150కు ఎగబాకింది.
  • పంజాబ్​లో మరో 162 మందికి కరోనా సోకింది. మొత్తం మరణాల సంఖ్య 105కు చేరింది.
  • కేరళలో ఇవాళ 141 మంది కొవిడ్​ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 3,451కి చేరింది. మరొకరు మరణించారు.
  • కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్​లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు.
  • బంగాల్​లో మరో 370 మంది కరోనా బారినపడ్డారు. మరో 11 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 580కి చేరింది.

ఇదీ చూడండి:మారుతీ సిబ్బందికి కరోనా- క్వారంటైన్ నుంచి మాయం

Last Updated : Jun 23, 2020, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details